Switch to English

టీడీపీని చంద్రబాబాబు ఆ పార్టీలో కలిపేస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా మాయమైపోయింది. 2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద షాక్‌ ఇచ్చాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యులతో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని ఇంకో ఐదేళ్ళు నడపడం సాధ్యమేనా.? ఛాన్సే లేదన్న భావనతో ఆల్రెడీ టీడీపీకి చెందిన ముఖ్య నేతలు తమ దారి తాము చూసేసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీలో విలీనమైపోయిన విషయం విదితమే. తాజాగా ఓ ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు.

ఇన్నాళ్ళూ టీడీపీ తరఫున బలంగా వాయిస్‌ విన్పించిన లంకా దినకర్‌, చందు సాంబశివరావు కూడా టీడీపీకి దూరమయిపోయారు. ప్రస్తుతం పార్టీని నిలబెట్టేంత బలం వున్న నేతలు టీడీపీలో ఒకరిద్దరు మాత్రమే కన్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని నడపడమంటే చంద్రబాబుకి అది కత్తి మీద సామే. కేవలం రెండు మూడు నెలల్లోనే చంద్రబాబు జైలుకు వెళతారంటూ బీజేపీ జాతీయ స్థాయి నేతలు జోస్యం చెబుతోంటే, ఆ ఎఫెక్ట్‌ టీడీపీలోని ఇతర నేతలపై గట్టిగా పడకుండా ఎలా వుంటుంది.?

ఢిల్లీ నుంచి అలాంటి బెదిరింపులు వుంటే, ఇంకోపక్క.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కూడా, చంద్రబాబుని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు పద్యవ్యూహాన్ని రచిస్తోంది. ఇన్ని ప్రతిబంధకాల నడుమ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నడపడం సాధ్యమయ్యే పని కాదు. దాంతో, చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో కలిపేయాల్సిందేననే భావన కొందరిలో వ్యక్తమవుతోంది. ఆ జాతీయ పార్టీ ఇంకోటేదో కాదు, భారతీయ జనతా పార్టీయేనని అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో టీడీపీ విలీనమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తప్పదు, ఇంకోసారి పెళ్ళికి మేం సిద్ధపడాల్సిందే. మోడీకి, చంద్రబాబు ఐడియాలు అవసరం. అందుకే, చంద్రబాబుని మోడీ చేరదీస్తారు..’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఇతర టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లాంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళడమంటేనే.. అది చంద్రబాబు స్కెచ్‌ అన్న అభిప్రాయం ఇప్పటికీ వుంది. మరి, ఆ స్కెచ్‌ నిజమైతే.. విలీనం కూడా నిజమయ్యే అవకాశాల్లేకపోలేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...