కృష్ణా జిల్లా కొండపలిలో రాజకీయం హీటెక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చెరో పధ్నాలుగు వార్డుల్ని గెలుచుకున్నాయి. ఓ వార్డుని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఆ స్వతంత్ర అభ్యర్థి కాస్తా టీడీపీ రెబల్ కావడం.. టీడీపీ అధిష్టానం బుజ్జగింపులతో ఆ స్వతంత్ర అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ వైపు తిరగడంతో టీడీపీ గెలుపు ఖాయమైపోయింది.
కానీ, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫీషియోగా ఓటు వేయనుండడంతో మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చింది. సో, ఇక్కడికి చెరో పదిహేను ఓట్లున్నాయన్నమాట. ఇక్కడో పెద్ద ట్విస్ట్. అదే, టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫీషియో ఓటు తెచ్చుకోవడం. అది కూడా కోర్టునాశ్రయించి ఆయన ఈ అవకాశం పొందారు.
దాంతో, వైసీపీ గుస్సా అయ్యింది. ఇరు పక్షాల మధ్య పెద్ద రాజకీయ రచ్చ జరిగింది. ఛైర్మన్ ఎన్నిక కోసం ఇరు వర్గాలూ కొట్లాటకు దిగాల్సి వచ్చింది.. అదీ అధికారుల సమక్షంలో. పోలీసులు ఎటూ అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తారు గనుక.. ప్రతిపక్షం డీలాపడాల్సి వచ్చింది. ప్రతిపక్షం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
న్యాయస్థానం ఆదేశాలతో మరోమారు ఛైర్మన్ ఎన్నిక కోసం రంగం సిద్ధమయ్యింది. సరే, ఎవరు గెలుస్తారు.? అన్నది వేరే చర్చ. స్వతంత్ర అభ్యర్థి టీడీపీ వైపు వెళ్ళడంతో, టీడీపీకి బలం పెరిగింది గనుక, అధికార వైసీపీ.. తన ఓటమిని హుందాగా అంగీకరించాల్సి వుంది. అలా అంగీకరిస్తే, అది వైసీపీ ఎందుకవుతుంది.?
ఇంతా చేసి, ఛైర్మన్ గిరీ ద్వారా అదనంగా వైసీపీకి వచ్చే లాభం ఏమన్నా వుందా.? ఏ పదవి అయినా, ప్రజల కోసం పని చేయడానికేనన్న సోయ అధికార పార్టీలో లేదు.. వుంటే ఇన్ని అనర్థాలే జరగవు.. అది ఎవరు అధికారంలో వున్నాసరే ఇదే తంతు.
డబ్బులతోనే దేన్నయినా గెలవాలి.. ఓటర్లకు డబ్బులు పంచడం దగ్గర్నుంచి వార్డు మెంబర్లు లేదా కౌన్సిలర్లకు డబ్బులు పంచడం వరకూ.. ఎన్నికల వ్యవస్థను అత్యంత పతన స్థాయికి దిగజార్చేశారు. అయినాగానీ, రాజకీయ పార్టీలకు సంతృప్తి కలగడంలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింతగా అప్రతిష్టపాలు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే వున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.
ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఈ బులుగు పచ్చ అనైతిక రాజకీయానికి ముగింపు ఎప్పుడో ఏమో.!
120398 491580I really like your writing style, excellent data, appreciate it for posting : D. 975165