డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధిపై దొంగతనం కేసు పెట్టారు. అయితే.. దీని వెనుక జరిగిందే అందరికీ నవ్వు తెప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయనిధి సత్తూరులో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మధురైలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామన్న బీజేపీ హామీని ప్రస్తావించారు. మధురైలోని తొప్పూర్లో 250 ఎకరాల్లో ఎయిమ్స్ కు 2019 జనవరి 27న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అయితే.. ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్ తీసుకొచ్చా’ అని ప్రచారంలో ఉదయనిధి ఓ ఇటుకను చూపిస్తూ.. అక్కడి ఇటుకే ఇది.. అన్నాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. దీంతో చిర్రెత్తిన ఓ బీజేపీ కార్యకర్త ఉదయనిధిపై దొంగతనం కేసు పెట్టాడు. ఎయిమ్స్లోని ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడులో విచిత్రమైన అంశంగా మిగిలింది.
662013 390390This internet site is my breathing in, extremely great pattern and perfect content material . 877938