మిల్కీ బ్యూటీ తమన్నా లాక్ డౌన్ కారణంగా తన పారితోషికాన్ని తగ్గించుకోనుందని వార్తలు వచ్చాయి. తను ఇప్పటిదాకా తీసుకుంటున్న పారితోషికంలో 30 శాతాన్ని కట్ చేసుకోనుందని, ఇది కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఆగిపోయి ఇబ్బందులు పడుతోన్న నిర్మాతలకు సహాయపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంటోందని అన్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ప్రకారంగా అలాంటిదేం లేదని తేలిపోయింది. తమన్నా ఒక సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం తమన్నా ఒక కన్నడ రీమేక్ లో నటించడానికి ఎస్ చెప్పినట్లు అధికారికంగా వెల్లడైంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లాక్ మాక్ టైల్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా తమన్నా హీరోయిన్ అని ప్రకటన వచ్చింది. నాగ శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అలాగే కాల భైరవ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా రేంజ్ అయితే చిన్నదే. అందులోనూ సత్యదేవ్ టాలెంటెడ్ అయినా కానీ ఇంకా చిన్న రేంజ్ హీరోనే. మరి తమన్నా తన పక్కన నటించడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
అయితే క్లోజ్ సోర్స్స్ ద్వారా తెలిసిన విషయమేమిటంటే తమన్నా ఈ చిత్రంలో నటించడానికి దాదాపుగా రెండున్నర కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనుందట. ఇది తను ఇప్పుడు హీరోయిన్ గా అందుకుంటున్న దానికంటే రెట్టింపు. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు ఎస్ చెప్పినట్లు సమాచారం.
తమన్నా ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే ఆచార్యలో ఒక కీలక పాత్రలో నటించనుంది.
485892 111460I discovered your weblog website web site on google and appearance some of your early posts. Preserve up the wonderful operate. I just extra increase Feed to my MSN News Reader. Searching for toward reading far a lot more by you later on! 853198
122036 101990extremely nice post, i really really like this internet site, carry on it 720040
851366 987382We will offer deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to lose. 835663