ఏమయ్యింది శ్రీరెడ్డికి.? ‘అడుక్కు తింటున్నా..’ అనే స్థాయికి ఆమె ఎందుకు దిగజారిపోయినట్టు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుని, సోషల్ మీడియా వేదికగా వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద నానా రకాల బూతుల్నీ ప్రయోగిస్తూ వచ్చిందామె.
ఇంకోపక్క, బతుకుదెరువుకోసం ఏవేవో వీడియోలు చేస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె యూ ట్యూబ్ ఛానల్ తాలూకు మానిటైజేషన్కి దెబ్బ పడుతోందిట. పదే పదే దెబ్బ పడుతుండడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు వాపోయింది శ్రీరెడ్డి ఓ వీడియోలో.
‘నేనే కాదు, చాలామంది వైసీపీ కార్యకర్తలది ఇదే పరిస్థితి. చాలా దారుణంగా వున్నారు వాళ్ళంతా ఆర్థిక ఇబ్బందులతో. వారిని ఆదుకోండి జగనన్నా..’ అంటూ ఓ వీడియో ద్వారా శ్రీరెడ్డి వేడుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.
తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా పరంగా చూస్తే, వైసీపీనే టాప్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో వున్నా, ఏపీలో అధికారంలో వున్న నీలి పార్టీతో పోల్చితే, గులాబీ పార్టీనే సోషల్ మీడియా పరంగా వెనకబడి వుంది.
వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి డీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విభాగం కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. మరి, ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయ్.? సోషల్ మీడియా సైనికులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని స్థితిలో వైసీపీ వుందా.?
నిజానికి, సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులకు చెల్లింపులు చాలా గట్టిగానే వుంటాయ్. ఇది బహిరంగ రహస్యం. మరి, శ్రీరెడ్డికి ఎందుకు వైసీపీ నుంచి సరిగ్గా చెల్లింపులు జరగట్లేదబ్బా.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. కష్టానికి తగ్గ ప్రతిఫలం వుండాలి కదా.? ఆ లెక్క, శ్రీరెడ్డికే అధిక చెల్లింపులు జరగాలి.!
శ్రీరెడ్డిని వైసీపీ లైట్ తీసుకుని వుండాలి.! అంతే, అవసరం తీరాక ఆమెని పక్కకు నెట్టేశారని అర్థం చేసుకోవాలేమో.!