ఇటివలి ఆస్ట్రేలియా సిరీస్ లో జరిగిన ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో భారత్ తన అద్భుత పోరాట పటిమతో మ్యాచ్ ను డ్రా చేసుకుని ఓటమి నుంచి తప్పించుకుంది. ఆ సమయంలో హనుమ విహారి, అశ్విన్ క్రీజ్ లో నిలిచిపోయి మ్యాచ్ ను కాపాడారు.
అయితే.. మ్యాచ్ చివరి రోజున హెడ్ కోచ్ రవిశాస్త్రి వాళ్లిద్దరికీ చెప్పమని ఓ వార్తను శార్దూల్ కి చెప్పి పంపించాడు. విహారిని ధాటిగా ఆడమని.. ఎండ్ లో అశ్విన్ ను వికెట్ కాపాడుకోవమని ఆ వార్త సారాంశం. అయితే..
శార్దూల్ డ్రింక్స్ సమయంలో వారి వద్దకు వెళ్లాడు కానీ.. రవిశాస్త్రి చెప్పమన్న మాట మాత్రం చెప్పలేదు. ఇద్దరూ బాగా ఆడుతున్నారు.. అలాగే ఆడండి అని మాత్రం చెప్పాడట. రవిశాస్త్రి మాట వారికి చేరకున్నా ఆటను నిలబెట్టారు. కాబట్టి ఆ మ్యాచ్ డ్రాలో శార్దూల్ కు కూడా భాగముందని చెప్పాలి. ఈ విషయాల్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ వెల్లడించారు. అశ్విన్ తో మాటల సందర్భంలో ఈ విషయాలు వెల్లడించారని చెప్పుకొచ్చాడు.
34607 432944This internet site is my aspiration , quite wonderful pattern and perfect articles . 313061