దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అందులో మొదటగా తన 26వ సినిమాగా ‘వకీల్ సాబ్’ని మొదలు పెట్టి షూటింగ్ ని 75% పూర్తి చేశారు. అలాగే తన 27వ సినిమా క్రిష్ డైరెక్షన్ లో 15 రోజులు షూటింగ్ కూడా చేశారు. ఇంతలో కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ ఆగిపోయాయి. నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఇది కాకుండా ఆయన వరుసగా సినిమాలు సైన్ చేస్తూ అభిమానుల్ని మరింత ఆనందంలో ఉంచుతున్నారు.
తాజాగా దసరా రోజున పవన్ కళ్యాణ్ మరోకొత్త సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. సాగర్ చంద్ర డైరెక్షన్ లో చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలో మొదటగా రానా దగ్గుబాటిని మరో హీరోగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు మాత్రం నితిన్ ని పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరో టాలెంటెడ్ హీరోయిన్ పవన్ తో జోడీ కట్టనుంది. తనే మన వరుణ్ తేజ్ ఫిదాలో హైబ్రీడ్ పిల్ల అంటూ ఆకట్టుకున్న సాయి పల్లవి.. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఎప్పటికప్పుడు అందరినీ మెప్పిస్తున్న సాయి పల్లవిని ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎన్నుకున్నారని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక మిడిల్ ఏజ్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు, తన భార్య పాత్ర కోసం సాయి పల్లవి అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన టీం సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
మరి పవన్ కళ్యాణ్ – సాయి పల్లవి జోడీ ఎలా ఉంటుందో? ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయలు కింద కామెంట్స్ లో తెలపండి.
554232 701126There is noticeably a bundle to realize about this. I assume you created specific nice points in functions also. 791832
689121 770693Immigration Lawyers […]the time to read or pay a visit to the content material or websites we have linked to below the[…] 817954