మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రలహరి ఈ నెల 12న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై సాయి ధరమ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా ఆరు పరాజయాల తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఈ సినిమా పై అటు అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తన ఫేట్ మార్చుకునే నేపథ్యంలో పేరును కూడా మార్పులు చేర్పులు చేసి .. సాయి ధరమ్ తేజ్ పేరు కాస్త సాయి తేజ్ గా మారింది. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మెగా హీరో తన మనసులోని మాటలను పంచుకున్నాడు.
కొన్ని సినిమాలకు మాట ఇచ్చినందుకు చేయాల్సి వచ్చిందని, ఆ సినిమాల విషయంలో కథ గురించి పెద్దగా పట్టించుకోలేదని, అందుకే తన సినిమాలు వరుసగా పరాజయాలు అందుకున్నాయని అన్నాడు. ఇకపై మొహమాటాలకు పోయేది లేదని, కథ నచ్చితేనే సినిమాకు ఓకే చెబుతానని అంటున్నాడు. అయితే హిందిలో సూపర్ హిట్టయిన గల్లీ బాయ్ సినిమాను రీమేక్ చేస్తాడంటూ వచ్చిన వార్తల గురించి తేజ్ స్పందిస్తూ .. గల్లీ బాయ్ సినిమాను తాను చూడలేదని ..వేరే ఉద్దేశం కాదు .. ఆ సినిమా చూసేందుకు టైం దొరకలేదని, అసలు ఆ సినిమా రీమేక్ విషయంలో ఎవరు తనను సంప్రదించలేదని అన్నాడు. అలాగే మరో హిందీ సినిమా కూడా రీమేక్ చేస్తారని అడిగితె ఆ సినిమా గురించి కూడా ఎవరు సంప్రదించలేదని అన్నాడు.
చిత్రలహరి సినిమా ఖచ్చితంగా తనకు మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు సాయి తేజ్. అటు దర్శకుడు కిశోర్ తిరుమలకు కూడా మంచి హిట్ అవసరం కాబట్టి వీరిద్దరూ ఈ సినిమాను హిట్టవ్వాలన్న కసితో చేసారు. మైత్రి మూవీస్ నిర్మించింది.
319038 222854Basically a smiling visitant here to share the enjoy (:, btw outstanding pattern . 665266
730874 682809I delight in, lead to I discovered exactly what I used to be taking a look for. 403089
492414 18322Gratitude for building this send! I in reality comprehend the no cost info. 431221