తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్తో సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. తన తాజా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ని చూడాలంటూ ఈ సందర్భంగా చిరంజీవి, తెలంగాణ గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. చిరంజీవి విజ్ఞప్తి పట్ల తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ గురించి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేయగా, తెలంగాణ గవర్నర్ సైతం ట్వీట్ చేయడం గమనార్హం. మరోపక్క, చిరంజీవి – తెలంగాణ గవర్నర్ భేటీ ‘సైరా నరసింహారెడ్డి’ కోసమేనా.? ఇతరత్రా అంశాలేమైనా ఈ భేటీలో చర్చకు వచ్చాయా.? అన్న విషయమై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇప్పుడంటే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారుగానీ, కొన్నాళ్ళ క్రితం ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా బీజేపీ పెద్దలు, చిరంజీవితో రాజకీయ మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా చిరంజీవితో రాజకీయ అంశాలపై చర్చించి వుండొచ్చన్న ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి.
మరోపక్క, చిరంజీవి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ భేటీ కానున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనూ భేటీ అయ్యేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్కి చెందిన సాక్షి మీడియా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడిన విషయం విదితమే. సాక్షి మీడియా చరిత్రలోనే, ఓ మెగా సినిమాకి ఈ స్థాయిలో పాజిటివ్ పబ్లిసిటీ చేయడం విశేషమే మరి.
148368 613569Outstanding read, I just passed this onto a colleague who was performing a bit research on that. And he in fact bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 339744
306424 932775Delighted for you to discovered this website write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment definitely what I are already seeking and I own book-marked this specific site online far too, Ill often be maintain returning soon enough to look at on your distinctive blog post. 7055
867690 495039I was searching at some of your articles on this internet site and I believe this internet website is genuinely instructive! Maintain on posting . 85667