ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ శుభారంభం చేసింది. సీజన్లో మొదటి సారి తలబడ్డ హైదరాబాద్ మరియు బెంగళూరు జట్లు హోరా హోరీగా తలపబ్డాయి. చివరి వరకు మ్యాచ్ రెండు జట్ల మద్య దోబూచులు ఆడింది. బెంగళూరు జట్టు 163 పరుగులు చేయడంతో హైదరాబాద్ ఈజీగానే ఛేదిస్తుందని అంతా భావించారు. మొదట ఈజీగానే పరుగులు రాబట్టినా వికెట్లు కోల్పోతున్నా కొద్ది హైదరాబాద్ జట్టు విజయావకాశాలు దెబ్బ తిన్నాయి. 163 లక్ష్యంకు పది పరుగుల దూరంలో అంటే 153 పరుగుల వద్ద హైదరాబాద్ ఆల్ ఔట్ అయ్యింది.
సన్ రైజర్స్ ను విజయం వైపు నడిపిస్తున్న మనీష్ పాండేను చాహెల్ పెవిలియన్ కు పంపడంతో మొత్తం ఆట బెంగళూరు వైపుకు మళ్లీంది. రెండు బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయిన సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయంలో లోపాలు కనిపించాయి. ఓపెనర్ వార్నర్ కేవలం ఆరు పరుగులకే ఔట్ అయినా మరో ఓపెనర్ బెయిర్ స్టో క్రీజులో నిలదొక్కుకున్నాడు.
మెల్లగా పరుగులు సాధిస్తున్న సమయంలో ఔట్ అవ్వడం ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ ను కోల్పో వాల్సి వచ్చింది. సచిన్ చెబుతున్నట్లుగా ఈ సారి తాము హాట్ ఫేవరేట్ అంటూ మొదటి మ్యాచ్ గెలుచుకుని కోహ్లీ సేన అందరిలో నమ్మకం నిలుపుకుంది. ఈ సీజన్ లో మొదటి సారి ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడేందుకు ఈ విజయం ఆరంభం అంటూ బెంగళూరు అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
620265 139707I truly treasure your piece of work, Fantastic post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 686344