ఐపీఎల్ 14 సీజన్ కు రాయలసీమ కుర్రాడు మారం హరిశంకర్రెడ్డి ఎంపికయ్యాడు. రాయచోటి నియోజవర్గం చిన్నమండెం మండలం బోనమల గ్రామం నాగూరివాండ్లపల్లె అతడి స్వగ్రామం. డిగ్రీ వరకూ చదువుకున్నా.. క్రికెట్ పై హరిశంకర్ రెడ్డికి ఉన్న ఇష్టమే ఐపీఎల్ వరకూ వెళ్లేలా చేసింది. ఇటివలి ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇతడిని రూ.20 లక్షలకు దక్కించుకుంది. బౌలింగ్లో మంచి ప్రతిభ చూపడంతో అండర్-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు.
ఈక్రమంలో 2016 నుంచి క్రికెట్ ఆడుతూ రంజీకి ఎంపికై 2018 నుంచి ఆంధ్రా జట్టుకు ఆడుతున్నాడు. హరిశంకర్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. హరిశంకర్రెడ్డి ఐపీఎల్కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. హరిశంకర్ రెడ్డి సాధించిన ఘనతపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతానికి చెందిన హరిశంకర్ రెడ్డి భవిష్యత్తులో మరింత ప్రతిభ కనపరచి భారత జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.
2151 177287Hey, you used to write wonderful, but the last several posts have been kinda boringK I miss your tremendous writings. Past several posts are just a bit out of track! come on! 276684
564451 798493omg! cant picture how rapidly time pass, following August, ber months time already and Setempber is the first Christmas season in my spot, I genuinely love it! 124269