Switch to English

రాజన్న క్యాంటీన్: వైసీపీ కడుపు మంట చల్లారిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ సబ్సిడీ క్యాంటీన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ అల్పాహారంతోపాటు రెండు పూటలా భోజనాన్ని రూ.5కే అందించేవారు. భోజన తయారీ, పంపిణీ బాధ్యతలను అక్షయపాత్ర అనే సంస్థ చూసుకునేది. వీరు భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసుకోగా.. ప్రభుత్వం ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనానికి కలిపి ఆ సంస్థకు రూ.58 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఒక్కో క్యాంటీన్లో రోజుకు మూడు పూటలా వెయ్యి నుంచి 1200 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు.

అయితే,వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 31తో అన్న క్యాంటీన్లను మూసివేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ పలు చోట్ల ఆందోళనలు కూడా నిర్వహించింది. తొలుత ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించిన అధికార పార్టీ జరుగుతున్న డ్యామేజీని గుర్తించింది. ఆస్పత్రుల్లో తొలుత వైఎస్సార్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే, అన్న క్యాంటీన్ల తొలగింపు వ్యవహారంతో నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించడంతో వాటిని పున:ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొన్ని మార్పులు చేర్పులు చేసి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. భోజనంలో కూరల సంఖ్యల పెంచడంతోపాటు నాణ్యత గల ఆహారం అందించే దిశగా సర్కారు కదులుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం క్యాంటీన్లకు ఉన్న పసుపు రంగును ఇప్పటికే తెలుపు చేశారు. దానికి వైఎస్సార్ సీపీ జెండా రంగు వచ్చేలా పచ్చ రంగు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

క్యాంటీన్లకు రాజన్న పేరు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తమ్మీద సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మళ్లీ రూ.5 భోజనం లభించనుంది. సో, తెలుగుదేశం పార్టీ మీద కడుపు మంటతో పేదోడి కడుపు మాడ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎట్టకేలకు తన తప్పు తెలుసుకుందన్నమాట. క్యాంటీన్ మీద ఏ పేరు వుంటేనేం.. పేదోడి కడుపు నిండితే అంతకన్నా కావాల్సిందేముంది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...