ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో కొద్దిపేపటి క్రితం వెల్లడించారు. ‘నేను నా కుటుంబసభ్యులు రెండు రోజులుగా కొద్దిపాటి జ్వరంతో బాధ పడ్డాం. తర్వాత జ్వరం తగ్గిపోయింది. అనుమానం వచ్చి పరిక్షలు జరిపించగా ఈరోజు మాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మేమంతా హోం క్వారంటైన్ లో ఉన్నాం. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడుతున్నాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నాం. శరీరంలో యాంటీ బాడిస్ పెంపొందించుకుని మా ప్లాస్మా డొనేట్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలతో, భద్రతలతో ఉండే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను కూడా వదలడం లేదు. అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా సోకడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు దేశవ్యాప్త గుర్తింపు ఉన్న రాజమౌళి కుటుంబం కూడా ఈ వైరస్ బారిన పడటం చర్చనీయాంశమైంది. సామాన్యులకే తప్పని వైరస్ బెడద.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఇటువంటి సెలబ్రిటీలకు తప్పకపోవడం దేశంలో కరోనా తీవ్రతను తెలియజేస్తోంది.
All of us are feeling better with no symptoms but are following all precautions and instructions…
Just waiting to develop antibodies so that we can donate our plasma… 🙂🙂💪🏼💪🏼— rajamouli ss (@ssrajamouli) July 29, 2020