రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది.
కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా కూడా వివాదాలు ఎదుర్కొంది. రామ్ గోపాల్ వర్మే, పవన్ కళ్యాణ్ మీద తీసిన ఓ పైత్యపు సినిమా పరిస్థితీ అంతే.! సినిమా వేరు, రాజకీయం వేరు కాదు.!
రాజకీయ కోణంలో తీసే సినిమాలు వేరు, రాజకీయ పైత్యంతో తీసే సినిమాలు వేరు.! ఇక్కడ మనం చెప్పుకుంటున్న చాలా సినిమాలు రాజకీయ పైత్యంతో తీస్తున్నవే. వీటిల్లో, కథ.. కాకరకాయ్.. ఏమీ వుండవ్.!
తాజాగా, ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వచ్చిందిగానీ, అంతలోనే ఆగిపోయింది. సినిమా ప్రదర్శనని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.. అదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.
హైకోర్టు, సినిమా ప్రదర్శనకు బ్రేకులు వేసిందంటూ, థియేటర్లలోకి వెళ్ళి మరీ పోలీసులు, సినిమా ప్రదర్శనలు ఆపేయడం గమనార్హం. టిక్కెట్టు కొనుక్కుని థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు సహజంగానే ఉస్సూరుమన్నారు.
మామూలుగా అయితే, ఈ తరహా సినిమాలకు టార్గెట్ ఆడియన్స్ మాత్రమే వెళుతుంటారు. సాధారణ ప్రేక్షకులకి ఇలాంటి సినిమాలు అస్సలు ఎక్కవు. ‘యాత్ర-2’ సినిమాని వైసీపీ క్యాడర్ మాత్రమే చూసింది. అదీ, టిక్కెట్లు ఉచితంగా పంచితే.
ఇక, ‘రాజధాని ఫైల్స్’ సినిమాలో, ఆంధ్ర ప్రదేశ్లోని అధికార పార్టీ ఎలా రాజధానిని నిర్వీర్యం చేసిందన్న అంశాల దగ్గర్నుంచి, వైఎస్ వివేకా హత్య వరకు.. చాలా అంశాల్ని చూపించారు.. సినిమా ఎలా వుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సంబంధిత వీడియో క్లిప్పింగ్స్కి మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన అప్లాజ్ కనిపిస్తోంది.