ఇటివల ఐపీఎల్-2020 సిరీస్ కు దుబాయి వెళ్లిన జట్టు నుంచి సురేశ్ రైనా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. అయితే అతడి రాకకు కారణమేంటనే దానిపై రకరకాల కథానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందించాడు. కుటుంబం, వ్యక్తిగత కారణాలతోనే తాను స్వదేశానికి తిరిగి వచ్చానని తెలిపాడు. క్వారంటైన్ లో ఉన్న సమయంలో ఆగష్టు 19న పంజాబ్ లోని తన మేనత్త ఇంటిపై జరిగిన దాడిపై తాను కలత చెందానని అన్నాడు. ఆ దాడిలో మావయ్య చనిపోయాడు.. చికిత్స పొందుతూ మరో కజిన్ మృతి చెందాడు. దీంతో తాను ఇండియాకు వచ్చానని అంటున్నాడు. అంతేకాకుండా.. ఈ విపత్కర పరిస్థితుల్లో తన కుటుంబం గురించి కూడా కలత చెందినట్టు చెప్పాడు. ఊరికే 12.5కోట్లు ఎందుకు పోగొట్టుకుంటాను.. అని కూడా అన్నాడు.
సీఎస్ కేతో రైనాకు వివాదం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ రైనా కొట్టి పడేశాడు. సీఎస్ కే యజమాని శ్రీనివాసన్ తనను చిన్న కొడుకుగా చూసుకున్నారు. మళ్లీ నేను టీమ్ తో కలిసినా కలవొచ్చు అన్నాడు. అయితే.. రైనా ఈ సీజన్ లో ఐపీఎల్ ఆడే అవకాశం లేదని సీఎస్ కే అఫిషియల్ గానే ప్రకటించింది. దుబాయ్ లో చెన్నై ఆటగాళ్లలో 11 మంది సిబ్బందికి, ఒక ఆటగాడికి కరోనా వైరస్ వచ్చిందని సీఎస్ కే తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఆటగాడు ఎవరన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో రైనా ఇండియాకు తిరిగి రావడం కలకలం రేపింది.
283246 528953Someone necessarily assist to make critically articles Id state. This really is the initial time I frequented your web page and thus far? I amazed with the analysis you created to make this actual submit incredible. Superb activity! 335601
671134 291138I recognize there is certainly an excellent deal of spam on this blog. Do you want assist cleansing them up? I might support in between classes! 965908