Switch to English

వెనక్కి నెట్టినా సింహాన్నే: తగ్గేదే లేదంటున్న రఘురామకృష్ణరాజు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

లోక్‌సభలో తన సీటుని వెనక్కి జరపడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సింహం కూర్చున్నదే సింహాసనం..’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమయ్యాయి. అయితే, ఆయన ఈ తరహా వ్యాఖ్యల్ని డైరెక్ట్‌గా చేయడంలేదు. మొన్నటికి మొన్న ‘సింహం సింగిల్‌గా వస్తుంది..’ అంటూ ఓ సినిమా డైలాగ్‌ని ప్రస్తావించారు.. తన మీద సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ‘గుంపుగా’ విమర్శలు చేయడంపై. ‘మమ్మల్ని పందులని అంటావా.?’ అంటూ మరింతగా రెచ్చిపోయారు వైసీపీ ఎమ్మెల్యేలు.

‘నేను సినిమా డైలాగ్‌ చెప్పాను. నేను సింహాన్ని కాదు.. మీరు పందులు కాదు..’ అంటూ తనదైన స్టయిల్లో సెటైరేశారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తాపీగా. ఇక, తాజాగా ‘సింహం – సింహాసనం’ అంటూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి వైసీపీది. ఇటీవల వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్ళి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు ‘సీటు’ వెనక్కి జరపబడింది కూడా. ‘నా సీటుని వెనక్కి నెట్టి.. నన్ను ఇంకా పెద్దవాడ్ని చేశారు.. ఇకపై పార్లమెంటులో పార్టీ తరఫున మాట్లాడేందుకు నాకు సమయం దొరక్కపోవచ్చు. కానీ, నష్టం లేదు. నాకు ఎంపీగా వున్న హక్కుల్ని, అవకాశాల్ని వినియోగించుకుని.. మరింత సమర్థవంతంగా ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తాను..’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో గోశాలల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తాజాగా లేఖాస్త్రం సంధించారు రఘురామకృష్ణరాజు. గత కొద్ది రోజులుగా లేఖల మీద లేఖలు రాస్తూ అధికార పార్టీకి మరింత తలనొప్పిగా మారుతున్న రఘురామకృష్ణరాజు, ‘పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద నాకున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవు. నేనింకా పార్టీలోనే వున్నాను.. పార్టీతోనే వుంటాను..’ అని పాత పాటే పాడుతుండడం గమనార్హం.

మరోపక్క, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న రఘురామకృష్ణరాజు అరగంటకు పైగా ప్రత్యేకంగా సమావేశమవడం మరో రాజకీయ దుమారానికి కారణమయ్యింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...