Prasanth Varma: సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన ‘హను-మాన్’ (Hanu-man) సినిమా.. ‘జై హనుమాన్’గా రెండో భాగం తెరకెక్కనుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన అప్డేట్ సంచలనం రేపుతోంది.
‘జై హనుమాన్’లో ఆంజనేయుడిగా ఓ స్టార్ హీరో నటించే అవకాశం ఉందని ప్రశాంత్ వర్మ ఆమధ్య చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆంజనేయుడిగా చిరంజీవి (Chiranjeevi) గారు నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా బిజీగా ఉన్నారు. ఆయన ఫ్రీ అయ్యాక ఓసారి కలిసి కథ వివరిస్తా. శ్రీరాముడిగా మహేశ్ (Mahesh) ని అనుకుంటున్నా’నని అన్నారు.
దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి దర్శకుడి ఆలోచనగా ఉన్న ఈ కాంబినేషన్ పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ‘హను-మాన్’ విడుదలై 17రోజులు అవుతున్నా స్టడీ కలెక్షన్లు రాబడుతూండటం విశేషం.