చంద్రబాబు, జగన్‌, పవన్‌.. ఎవరి పరిస్థితేంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,569FansLike
57,764FollowersFollow

ఎన్నికల పోలింగ్‌ ముగిశాక, ఫలితాల కోసం వేచి చూసే క్రమంలో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన పని తాను చేసుకుపోతున్నారు.. కోడ్‌ సంగతిని సైతం పట్టించుకోవడం లేదాయన. ఆపద్ధర్మ ముఖ్యమంత్రినని తెలిసీ, చంద్రబాబు ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం అధికారుల్ని ఇరకాటంలో పడేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం ఎన్నికల్లో తమదే గెలుపు.. అంటూ పోలింగ్‌ రోజునే ఓ ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత వ్యవహారమంతా పార్టీ నేతలు చూసుకుంటున్నారు. ఇక, జనసేన విషయానికొస్తే.. నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు జనసేనాని పవన్‌కళ్యాణ్‌.

మూడు ప్రధాన పార్టీల అధినేతల వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పోలింగ్‌ ముగిసింది కాబట్టి, చంద్రబాబు తిరిగి పాలనపై దృష్టి పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. జూన్‌ 8, 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు టర్మ్‌ ముగిసేది మళ్ళీ 2019 జూన్‌ 8నే అన్నది టీడీపీ నేతల గట్టి నమ్మకం. అయితే, ఎన్నికల కోడ్‌ ఇంకోలా చెబుతోంది. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలో వున్నవారికి సబబు కాదు. కానీ, ‘ఫలితాలు వచ్చేదాకా పాలనను పక్కన పడేయలేను కదా’ అని చంద్రబాబు చెబుతున్నారు.

సీనియర్‌ పొలిటీషియన్‌ అయిన చంద్రబాబు, ఎన్నికల కోడ్‌ని గౌరవించాలి. కానీ, ఆయన అలా చేయడంలేదు. ఈ క్రమంలో చంద్రబాబు అత్యుత్సాహంతో తీసుకుంటున్న నిర్ణయాలకు అధికారులు బలిపశువులైపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు పడింది.. దానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబే. ఇంకోపక్క, చంద్రబాబు ఏం చేసినా తప్పుపట్టడమే రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రం పరువుని ఢిల్లీ స్థాయిలో బజారుకీడ్చేస్తోంది ప్రతిపక్షం. టీడీపీ అత్యుత్సాహానికి వైఎస్సార్సీపీ ఓవరాక్షన్‌ తోడై.. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి.

ఇదిలా వుంటే, ఓటరు ఇచ్చే తీర్పు పట్ల గట్టి నమ్మకంతో వున్న జనసేన పార్టీ, పోలింగ్‌ పూర్తవగానే జనంలోకి వెళ్ళడం మొదలు పెట్టింది. సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే వుంటుందని పవన్‌ గతంలో చెప్పినట్లుగానే జనసేన నేతలు జనంలోనే వుంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ మాత్రం, మీడియా ముందుకు రావడంలేదు. వస్తే, ఆయన జరుగుతున్న పరిణామాలపై స్పందించాలి. అలా స్పందించే క్రమంలో ఆయన్నుంచి పొరపాటు మాటలు దొర్లినా దొర్లకున్నా వివాదం చేయడానికి ఎలాగూ రాజకీయ ప్రత్యర్థులు సిద్ధంగానే వుంటారు. అందుకే, ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ హుందాగా వ్యవహరిస్తున్నారు.

పవన్‌కళ్యాణ్‌, పార్టీ నేతలతో అంతర్గత సమీక్షల్లో మునిగి తేలుతుంటే, అభ్యర్థులు, జనసైనికులు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అధినేతకు తెలియజేస్తున్నారు, అదే సమయంలో ప్రజలకు అండదండలు అందిస్తున్నారు. ‘మేం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తాం..’ అని జనసేన నేతలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ చెబుతున్నట్లు 150 లెక్కలు జనసేన చెప్పడంలేదు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను సుతిమెత్తగా తిప్పికొడుతూనే వున్నారు జనసైనికులు.

పాతికేళ్ళ రాజకీయానికి ముందస్తుగానే సరైన వ్యూహరచన చేసుకోవడమే తమ బలమని జనసేన చెబుతోంది. గెలిచినా ఓడినా తమది ప్రజల పక్షమేనన్నది జనసేన వాదన. ఒకటి రెండు సీట్లు కూడా కష్టమేనని జనసేనను వెటకారం చేస్తూ, ఆ పార్టీ జపం చేయకుండా వుండలేకపోతున్న టీడీపీ కావొచ్చు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కావొచ్చు.. మే 23న వచ్చే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తాయి? జనసేనలా స్థిమితంగా వుండగలుగుతాయా? కష్టమే.! ఎందుకంటే, వాటికి అధికారమే పరామవధి.

11 COMMENTS

సినిమా

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ఏమిటి?

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు సమస్య ఎక్కడో ఉందా? ముందు చాలా సింపుల్...

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...