Switch to English

ఏపీకి 55 వేల కోట్లు వచ్చేదెలా జగన్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఒకటి కాదు.. రెండు కాదు.. పది కాదు, పాతిక కాదు.. వందా కాదు, వెయ్యీ కాదు.. ఏకంగా 55 వేల కోట్ల రూపాయల్ని కేంద్రం నుంచి తీసుకురావాలి.. అదీ పోలవరం ప్రాజెక్టు కోసం. ఇందులో కేంద్రం ఇస్తామంటోన్నది 20 వేల కోట్లు మాత్రమే. మరి, 30 వేల కోట్ల రూపాయల మాటేమిటి.? ఇదంతా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన వ్యవహారమే.

చంద్రబాబు హయాంలో 55 వేల కోట్ల రూపాయల అంచనాల్ని రూపొందించారు పోలవరం ప్రాజెక్టు కోసం. దానికి కేంద్రం గతంలో చూచాయిగా ఆమోదం కూడా తెలిపింది. కానీ, ఏమయ్యిందో.. ‘తూచ్‌.. మేం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం..’ అంటూ కొర్రీలు పెట్టింది. దీనిపై నానా యాగీ జరుగుతోంది.

ఓ పక్క ‘పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా నిధులు ఇచ్చే బాధ్యత మాదే.. ఎందుకంటే, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి..’ అంటోంది కేంద్రం. ఇంకోపక్క, ‘కొర్రీలు’ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్‌ కుమార్‌ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. తాజాగా, ఇంకోసారి కేంద్రం వద్ద ’55 వేల కోట్ల అంశాన్ని’ ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌ ప్రస్తావించారు.

ఓ పక్క, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడ్డారనీ, అడ్డగోలుగా అంచనాల్ని పెంచేశారని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్రం కూడా దీనికి వంత పాడుతోంది. ఇంకోపక్క, అదే 55 వేల కోట్ల విషయమై కేంద్రంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు. 55 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి అవసరం.. అన్నది నిజమే అయితే, చంద్రబాబు చేసింది రైటేనని వైసీపీ ఒప్పుకున్నట్లే అవుతుంది. కానీ, చంద్రబాబు చేసింది తప్పు.. అని ప్రచారం చేస్తోంది. ఇంతకీ ఏది నిజం.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఒక్కటి మాత్రం నిజం.. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో మూడు ముక్కలాట నడుస్తోంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ ఆడుతున్న ఈ ఆటలో పోలవరం ప్రాజెక్టు సమిధలా మారిపోయే ప్రమాదం పొంచి వుంది. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముందు వైఎస్‌ జగన్‌ వుంచిన చిట్టాలో, వేల కోట్ల బకాయిల ప్రస్తావన వుంది. అందులో మేజర్‌ షేర్‌ పోలవరం ప్రాజెక్టుదే. అసలు, కేంద్రం.. ఆ స్థాయిలో రాష్ట్రానికి నిధులు ఇచ్చే అవకాశం వుందా.?

బడ్జెట్‌ ప్రతిపాదనల్ని కేంద్రం సిద్ధం చేస్తున్న వేళ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగేదేమన్నా వుందా.? అంటే, ‘అసాధ్యమే’ అన్న అభిప్రాయమే సర్వత్రా విన్పిస్తోంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం కొత్తేమీ కాదు.. కేంద్రం ప్రతిసారీ మొండి చెయ్యి చూపడమూ కొత్త కాదు. ‘కేంద్రం సహకరిస్తోంది..’ అంటూ వైసీపీ ‘డప్పు’ కొట్టడమూ కొత్త కాదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...