జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే, అక్కడ జన సంద్రమవడం మామూలే.! అభిమానులు, కార్యకర్తల హంగామా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ట్రెండ్ ఇంకాస్త పాజిటివ్గా మారింది జనసేన పార్టీకి. రైతులు, సామాన్యులు కూడా జనసేనాని వెంట కనిపించారు.
అకాల వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడంలేదంటూ విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. తడిసిన ధాన్యం పాడైపోతున్న దరిమిలా, రైతులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. జనసేన అధినేత వారిని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలిసి, రాత్రికి రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం హడావిడి చేసింది.
కానీ, అధికార పార్టీ యెత్తులు పారలేదు.! జనసేన అధినేతకు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. జనసేన ప్రభుత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు జనసేనానితో రైతులు చెప్పుకొచ్చారు.
కాగా, రైతులకు జనసేన పార్టీ అండగా వుంటుందనీ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఉపశమనం కల్పిస్తామని జనసేనాని చెప్పుకొచ్చారు. దారి పొడుగునా జనసేనానికి మహిళలు సైతం స్వాగత నీరాజనాలు పలకడం గమనార్హం. అక్కడక్కడా అభిమానుల హంగామా కారణంగా కొంత ఇబ్బంది పడ్డారు జనసేనాని.
మరోపక్క, జనసేనాని మీద అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం అవాకులు చెవాకులు మామూలే.!