2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ‘పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతం. 2014లో సూటిగా ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాడి బరిలో నిలిచాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం- ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలి. ప్రశ్నించడాన్ని తేలికగా తీసుకోవద్దు. అదే మార్పుకు శ్రీకారం. 2014లో 6గురు కార్యవర్గంతో మొదలై 76కి.. 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో మొదలై.. నేడు 3లక్షల 26వేలకు చేరుకుంది. త్వరలో 5లక్షలు కాబోతోంది. 2019 ఎన్నికల్లో 7.24 శాతం ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో 27శాతం, పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు జనసేన మద్దతుతో గెలిచారు. కార్యకర్తలు నా వెంట నడవండి.. నేను నడిచి చూపిస్తా.
కూల్చివేతలతో ప్రారంభమైన పాలన..
‘నాయకులెవరైనా ‘భారతదేశం నా మతృభూమి’ అని ప్రతిజ్ఞ చేస్తే.. వైసీపీ మాత్రం.. ‘ఏపీ ప్రజలు మా బానిసలు.. వారి నడ్డి విరగ్గొడతాం.. న్యాయ వ్యవస్థను లెక్క చేయం.. రోడ్లను గుంతలమయం చేస్తాం…. ఒక్క చాన్సిస్తే 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం’ అని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చినట్టు ఉంది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది. ఒక్క ఛాన్సని ఏపీని జగన్ మంచేశారు. కొత్త ప్రభుత్వం శంకుస్థాపనలతో శుభం పలకాలి.. వైసీపీ కూల్చివేతలతో అశుభం పలికింది. ఇసుక పాలసీ లోపాలతో 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీ. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు..? మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేన. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతే’.
హామీలు ఏమయ్యాయి..?
అధికారంలోకి వస్తే 14,300 పోలీసు ఉద్యోగాలిస్తామని.. 400 ఉద్యోగాలిచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు మా నాయకుడు అవగాహన లేకుండా మాట్లాడారని అంటున్నారు. రాష్ట్రంలో అప్పులు 7లక్షల కోట్లు దాటాయి. రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి.. కొత్తవి రావడం లేదు. మద్య నిషేధం అని చెప్పి అదే మద్యంపై కోట్లు సంపాదిస్తున్నారు. గత ప్రభుత్వ 5ఏళ్ల రికార్డుని రెండున్నరేళ్లలోనే బ్రేక్ చేశారు. వైసీపీ పాలసీలపైనే నా ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు.
మదమెక్కిన వైసీపీ మహిషానికి కొమ్ములు విరగొట్టి..
బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పని చేస్తా. అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగొట్టి గద్దె దించుతాం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే ఎన్నికల సమయంలో ఆలోచిస్తాం’ అని అన్నారు. ఈక్రమంలో తాము అధకారంలోకి వస్తే ఏమేం చేస్తామో జనసేన అధినేత ప్రకటించారు. అమరావతిని అభ్యుదయ రాజధానిగా నిర్మిస్తాం. సచివాలయ ఉద్యోగాలను సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలుగా కాకుండా చూస్తాం. ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం నుంచి 10లక్షలు అందిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. సీపీఎస్ రద్దు చేస్తాం’ అని అన్నారు.
246726 821035Aw, this was a genuinely nice post. In thought I would like to place in writing in this way moreover – taking time and actual effort to create a quite good article but what / things I say I procrastinate alot and also no indicates apparently get something done. 64898
953699 279663Thanks for your time so significantly for your impressive and remarkable guide. I will not be reluctant to endorse your web internet sites to any individual who ought to receive direction on this difficulty. 337717
763156 513191Thanks for the data provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 731654
370114 855976I respect your piece of work, appreciate it for all the intriguing content material . 457176
78015 28156Glad to be one of several visitants on this amazing internet web site : D. 49428