జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో భాగంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారని తెలుస్తోంది. ఇటివలే ఈ అంశంపై జనసేన కీలక ప్రకటన కూడా చేసింది. ఢిల్లీ వెళ్లి అవసరమైదే ప్రధాని మోదీతో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడతానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు జనసేనాని. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇదే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నిక అంశంపై కూడా మాట్లాడతారని తెలుస్తోంది. ఈక్రమంలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం అవుతారని అంటున్నారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది.
525037 379832woah i like yur site. It really helped me with the info i wus searching for. thank you, will save. 241820
80988 617095Howdy! I just wish to give a huge thumbs up for the fantastic info you may have here on this post. I will probably be coming back to your weblog for far more soon. 73600