Switch to English

Janasena: అభ్యర్థుల ఎంపికకు లోతైన అధ్యయనం చేస్తున్న జనసేనాని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సాధికారత సాధించడానికి బలమైన సంఖ్యాబలంతో శాసనసభలో అడుగుపెట్టాలన్న ధృడ సంకల్పంతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు, కులాలవారికి రాజకీయ సాధికారతతోనే న్యాయం చేయగలమని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన రాజకీయ సన్నిహితులు చెబుతున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో పోటీచేయదలచుకున్న స్థానాలు, పోటీకి నిలిపే అభ్యర్థులపై నిశితంగా అధ్యయనం చేస్తున్నారు.ఈ నెల 14 వ తేదీ నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికి సుమారు 20 స్థానాలకు సంబంధించి అధ్యయనం మొదటి విడత పూర్తయింది. సుమారు 80 నుంచి 85 స్థానాలపై ఇటువంటి ప్రత్యక్ష అధ్యయనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది?

జనసేన స్థాపించి వచ్చే మార్చితో పదేళ్లు పూర్తవుతాయి. అంతకు ముందు ప్రజారాజ్యం హయాంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఈ రాజకీయ ప్రయాణంలో బి.సి., ఎస్.సి., ఇతర కులాలవారు, వర్గాలు, అభిమానులు, ముఖ్యంగా ఆయన సామాజికవర్గమైన కాపులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు. ఆయన వెంట నడిచారు. వీరందరికీ న్యాయం చేసేలా అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు లోతైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్. సి., బి.సి., ముస్లింల అభ్యున్నతిని ఆయన కాంక్షిస్తున్నారు. మత్స్యకారులు, శెట్టిబలిజ-గౌడ ఇతర ఉపకులాలవారు, చేనేత వర్గాలు, నాయీ బ్రాహ్మణులు, కమ్మర, కుమ్మరి, రజక తదితర వృత్తి ఆధారిత సమస్త బి.సి. కులాలు, ఎస్.సి.లు ముఖ్యంగా రెల్లి కులస్తులు, అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతి, వారి ఆర్ధిక పరిపుష్టికి కృషిచేయడంతో పాటు వారికి రాజకీయ సాధికారిత సంప్రాప్తించే విధంగా నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల ఎంపిక జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ధన ప్రభావాన్ని ఎలా అధిగమిస్తారు?

గత ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మరో విధంగా చెప్పాలంటే సామాన్యులు పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. డబ్బు వెదజల్లేవాడే ప్రజల దృష్టిలో బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడు. మరి అభ్యర్థుల ఎంపికలో ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్ధిక బలం కొంత సవాలుతో కూడుకున్న విషయం. దీనిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ భావజాలం, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన వారిని బరిలోకి దింపడం కొంత కష్టమైన ప్రక్రియే. అయితే ఆయనకున్న సామాజిక స్పృహ, ప్రజాభిమానంతో వీటిని అధిగమిస్తారన్న అభిప్రాయం జనసేన పార్టీ నాయకులలో కనిపిస్తోంది.

లెక్కకు మిక్కిలిగా సమాచారం:

ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలకు చెందిన సంపూర్ణ సమాచారం ఆయనవద్ద ఉన్నట్లు తెలిసింది. వివిధ సంస్థలు చేసిన సర్వేలు, జనసేనకు బలమున్న నియోజకవర్గాలు, అటువంటి నియోజకవర్గాలలో సామాజిక సమీకరణాలు, జనసేనకు ప్రస్తుతం ఉన్న ఓట్ల బలం, తెలుగుదేశంతో కలిస్తే జతయ్యే ఓట్ల వివరాలు, విజయావకాశాలను జనసేన ప్రభావితం చేసే స్థానాలు, జనసేన ఆశావాహుల బలాబలాలు, ప్రత్యర్థి అభ్యర్థుల ప్లస్ లు మైనస్ లు వంటి సమాచారం జనసేన అధినేత వద్ద సిద్ధంగా ఉంది. వీటి అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు.

వై.సి.పి. విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా…

ఈ అయిదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా విశ్వసిస్తున్నారు. అనేక సభలలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రయోజనాలు, తనకు మద్దతుగా నిలిచిన వర్గాల ప్రయోజనాలు కాస్త సడలించుకుని తెలుగుదేశం పార్టీ, కలిసివస్తే బి.జె.పి.తో కలసి పోటీచేయడానికి సంసిద్దమైనట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాలలో వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఓటు చీలిపోకూడదని…. ఈ కారణంగానే శ్రీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో క్లిష్ట దశలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల విభజన ఏ రీతిలో జరుగుతుంది? గౌరవప్రదమైన పంపకం జరుగుతుందా అనే అంశం ఆసక్తిగా మారింది.

గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని?

జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన అభిలాషతో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు ,కాపులతోపాటు బి.సి., ఎస్.సి. వర్గాలకు చెందిన వారు పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండడంతో వీరందరిలో ఒకరకమైన ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సంఖ్య గౌరవ ప్రదంగా ఉంటుందా? గౌరవప్రదమైన సంఖ్య అంటే ఎంత? కనీసం 60 నుంచి 70? వంటి ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే 40 నుంచి 45 స్థానాలలో జనసేన విజయం తధ్యమని, మరో 30 స్థానాలలో విజయానికి చేరువలో ఉంటుందని జనసేన వద్ద సర్వే నివేదికలు ఉన్నట్లు తెలిసింది. గౌరవప్రదమైన సీట్లు జనసేనకు దక్కినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి బదలీ అవుతాయని జనసైనికులు బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కూకట్ పల్లి ఎన్నికలలో మా నాయకుడు ఒక్క రోజు పర్యటిస్తే దగ్గరదగ్గర 40 వేల ఓట్లు వచ్చిన సంగతిని వారు గుర్తుచేస్తున్నారు.

శ్రీ లోకేష్ ప్రకటన ప్రభావమెంత?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం-జనసేన గెలిస్తే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడేనని శ్రీ నారా లోకేష్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో సంచలనమే సృష్టించింది. ఈ ప్రకటనపై జనసైనికులలో ఒకింత ఆగ్రహమే వ్యక్తమైంది. దీని ప్రభావం ఇరు పార్టీల పొత్తుపై ఎంతవరకు ఉంటుందని ప్రత్యర్థి రాజకీయ పార్టీ సైతం లెక్కలు వేసింది. ఇలా ప్రకటించడం పొత్తు ధర్మమేనా అని జనసైనికులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేనాని సంయమనం పాటిస్తున్నారని జనసైనికులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరిన తరువాత చేసిన సర్వేలలో పెరిగిన బలం చూసి శ్రీ లోకేష్ అలా మాట్లాడి ఉండవచ్చని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి పోటీ చేసేవారే లేరన్న సంగతిని వారు గుర్తుచేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనగా విజయవంతమైన యువగళం ముగింపు సభ ప్రభావం కూడా కావచ్చని జనసేన నాయకులు పేర్కొంటున్నారు. అయినా దీనిపై సరైన సమయంలో జనసేనాని తప్పకుండా స్పందిస్తారని వారు భావిస్తున్నారు.

ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-తెలుగుదేశం పొత్తు వాంఛనీయం. ఈ పొత్తు కొన్నెళ్లపాటు కొనసాగాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఎస్. సి., బి. సి., ముస్లింలు, బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతే ప్రధాన అజెండాగా జనసేన ఎన్నికల వ్యూహం ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...