జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖపట్నం వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరుకి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత కారణంగా చోటు చేసుకుంటున్న భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో జనసేన అధినేత, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నిరసన కవాతుని నిర్వహిస్తున్నారు.
తొలుత, ‘టీడీపీ అద్దె మైకు’ అంటూ లైట్ తీసుకున్న వైసీపీ, క్రమక్రమంగా జనసేన నిరసన కార్యక్రమానికి మద్దతు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతోంది. మరోపక్క భవన నిర్మాణ రంగ కార్మికులు ఆందోళన బాటపట్టడం.. అదే సమయంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో తమ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందనే భయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో కలిగినట్లుంది.
ఇప్పటిదాకా ఇసుక వ్యవహారంపై దృష్టిపెట్టని ముఖ్యమంత్రి అనూహ్యంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘పళ్ళున చెట్టుకే రాళ్ళు..’ అంటూ తమ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు జగన్. విపక్షాలది దుష్ప్రచారం.. అని కూడా మండిపడ్డారు. కానీ, ‘ఇసుక వారోత్సవం నిర్వహించాలి..’ అంటూ అధికారులకు జగన్ దిశా నిర్దేశం చేయడం గమనార్హం.
జనసేన అధినేత వైఎస్ జగన్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని డైల్యూట్ చేసే క్రమంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది నిర్వివాదాంశం. అంతిమంగా ప్రజల ఇబ్బందులు తొలగాలన్నదే విపక్షాల ఆలోచన. అయితే, షరామామూలుగానే ‘వరద కారణంగా ఇసుక కొరత..’ అంటూ ప్రభుత్వం సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడమే బాధాకరం.
మొన్నటికి మొన్న ‘ఇసుక విదానం’ తెచ్చిన నష్టం చూశాం. ఇప్పుడీ ‘ఇసుక వారోత్సవం’ తీసుకురాబోయే ‘మార్పు’ ఇంకెంత ఘనంగా వుంటుందో వేచి చూడాల్సిందే.
816070 825391Looking forward to look you. 892691
831127 720947Of course like your site but you need to check the spelling on several of your posts. Several of them are rife with spelling troubles and I uncover it really bothersome to tell the truth nevertheless Ill definitely come back again. 232410
224308 796149I extremely delighted to discover this internet web site on bing, just what I was looking for : D besides saved to bookmarks . 255430