మాజీ కేంద్ర మంత్రి పురంధరీశ్వరి భర్త, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అప్పట్లో అది ‘కమ్మ’గా అన్పించింది. సామాజిక వర్గ సమీకరణాలు సహా అనేక లెక్కలేసుకుని, ఆ మాటకొస్తే బతిమాలుకుని మరీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వైసీపీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అది ఎన్నికలకు ముందర వ్యవహారం.
కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. అప్పుడు ‘కమ్మ’గా అన్పించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు, ఇప్పుడు ‘కష్టంగా’ కన్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డికి. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే పార్టీలో కింది స్థాయి నేతలు వ్యవహరిస్తుంటారు అధికార పార్టీలో. పర్చూరు నియోజకవర్గంలో అదే జరుగుతోంది.
దగ్గుబాటికి వ్యతిరేకంగా రచ్చ జరుగుతోంది. ‘మీ భార్య బీజేపీలో వుండడం, మీతోపాటు మీ తనయుడు వైసీపీలో వుండడం రాజకీయంగా మంచిది కాదు..’ అంటూ పార్టీ ముఖ్య నేతలతో దగ్గుబాటికి చెప్పించేశారు వైఎస్ జగన్. ఇక, అక్కడి నుంచి రచ్చ తారాస్థాయికి చేరింది. పర్చూరు గొడవ ఇప్పుడు అమరావతికి కూడా చేరుకోవడం గమనార్హం. దగ్గుబాటి మద్దతుదారులు, దగ్గుబాటి వ్యతిరేకులూ అమరావతి వేదికగా ఒకర్ని ఒకరు దూషించుకోవడమే కాదు, ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకునేదాకా వెళ్ళింది పరిస్థితి.
పురంధరీశ్వరి బీజేపీ నేత అని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు వైసీపీలో చేరినప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్కి తెలియదా.? పార్టీ శ్రేణులకు ఆ మాత్రం ఇంగితం లేదా.? ఇప్పుడెందుకు ఈ అంశం తెరపైకొచ్చిందంటే, ఇక్కడ ‘కుల సమీకరణాల’ వ్యవహారాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. నిజమేనా.? ఆ సమీకరణమే ఈ మొత్తం ఇవాదానికి కారణమా.? ఏమో, కాదని మాత్రం ఎలా చెప్పగలం.?
793597 549546My plate is real full and your tryna give me more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 567035