భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పై ఆస్ట్రేలియన్లు మరోసారి నోరు పారేసుకున్నారు. ఆసీస్ తో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆదివారం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. శనివారం సిరాజ్ తోపాటు బుమ్రాను ఉద్దేశించి ఓ ఆసీస్ ప్రేక్షకుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేయగా.. ఆదివారం కూడా ఆ పరంపర కొనసాగింది.
ఆదివారం ఆట రెండో సెషన్ లో సిరాజ్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. కొంతమంది ప్రేక్షకులు అతడిని ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ రెహానేకు అతడు తెలియజేశాడు. దీంతో రెహానె వెళ్లి ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేయగా.. కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మైదానం సిబ్బంది, పోలీసులు అక్కడకు వెళ్లి.. ఆరుగురు యువకులను బయటకు పంపించేశారు. కాగా, ఈ విషయం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా టీంఇండియాకు క్షమాపణ చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలను తాము సహించబోమని పేర్కొంది. క్రికెటర్లను ఉద్దేశించి జాత్యంహకార వ్యాఖ్యలు చేసినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఆదివారం సిరాజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆరుగురు యువకులను పోలీసులు విచారిస్తున్నారని తెలిపింది.
323451 959517As I web site owner I feel the subject material here is real amazing, appreciate it for your efforts. 538950
140896 445054Good 1, there is truly some fantastic facts on this post some of my subscribers may find this valuable, will send them a link, many thanks. 37976
318598 444501I enjoyed reading your pleasant website. I see you offer priceless information. stumbled into this site by chance but Im confident glad I clicked on that link. You definitely answered all the questions Ive been dying to answer for some time now. Will definitely come back for much more of this. 316863