Switch to English

జూ. ఎన్టీఆర్‌, చరణ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. ఇద్దరూ కలిసి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా వార్నింగ్‌? స్నేహితుల దినోత్సవం రోజున ఎవర్ని టార్గెట్‌గా చేసుకుని ఇద్దరు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ వార్నింగ్స్‌ జారీ చేశారు? సినీ వర్గాల్లో ఇప్పుడు అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు విషయమేంటంటే, స్నేహం గురించి చరణ్‌, ఎన్టీఆర్‌.. ఇద్దరూ తమదైన స్టయిల్లో సోషల్‌ మీడియాలో స్పందించారు.

మరోపక్క చరణ్‌ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా సోషల్‌ మీడియా వేదికగా తమ మధ్య స్నేహాన్ని చాటుకున్నారు. నిజానికి, ఎన్టీఆర్‌ – చరణ్‌ మధ్య స్నేహం చాలాకాలం క్రితమే ప్రాంభమయ్యింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘బాద్‌ షా’ సినిమా ప్రారంభమయినప్పటి రోజులవి. ‘బావా..’ అంటూ ఎన్టీఆర్‌ – చరణ్‌ కలిసి సందడి చేశారు ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత పలు సందర్భాల్లో చరణ్‌, ఎన్టీఆర్‌ కలుసుకున్నారు. కానీ, అభిమానుల వ్యవహారం ఇంకోలా వుంది.

చరణ్‌ అభిమానులంటే, మెగా అభిమానులే కదా.! ఆ మెగా అభిమానుల్ని, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో మెగా అభిమాని ఒకరు తిరుపతిలో హత్యకు గురయ్యారు కూడా. పవన్‌ కళ్యాణ్‌, ఆ అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. ‘సినీ పరిశ్రమలో మేమంతా కలిసే వుంటాం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి వుంటాం. మా పేరు చెప్పి, మీరు కొట్టుకోవడం బాగోలేదు’ అంటూ మొత్తంగా అభిమానులందరికీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

మరోపక్క, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకీ, మహేష్‌ అభిమానులకీ మధ్య గొడవలున్నాయి. ఆ గొడవల్ని తగ్గించే క్రమంలో, మహేష్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ‘మహేష్‌ అన్నా..’ అంటూ అప్యాయంగా మాట్లాడాడు. ఆ తర్వాత చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌.. అదే రోజు నైట్‌ పార్టీలో సందడి చేశారు. హీరోల మధ్య గొడవలేమీ వుండవు. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ వుండాల్సిందే. ఆ పోటీని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అభిమానులే కొట్టుకుంటున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో చాలా దారుణంగా గొడవలు జరుగుతున్న దరిమిలా, స్నేహితుల దినోత్సవం రోజున.. ఎన్టీఆర్‌, చరణ్‌.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇకనైనా అభిమానులు మారాలి. తమ అభిమాన హీరోల్ని చూసి నేర్చుకోవాలి. ప్రేమిస్తే పోయేదేముంది బాస్‌.. తిరిగి ప్రేమిస్తారంతే.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...