మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ రేంజ్లో ప్రమోట్ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎవరూ ఊహించని అతిథులు హాజరు కాబోతున్నారట.
ఆ లిస్ట్లో ప్రభాస్, మహేష్తోపాటు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా విన్పిస్తోంది. నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని సమాచారమ్. మెగా కాంపౌండ్ నుంచి దాదాపు అందరూ ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ కమర్షియల్ సినిమాలా మాత్రమే కాకుండా, దీన్నొక ‘పాన్ ఇండియా’ ఫిలిం, పేట్రియాటిక్ ఫిలిం.. అనే కోణంలోనే అంతా భావించేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.
ఇదిలా వుంటే, మహేష్తోపాటు ఎన్టీఆర్, ప్రభాస్లతో ఇప్పటికే నిర్మాత రామ్చరణ్ సంప్రదింపులు షురూ చేశాడనీ, ఆ ముగ్గురూ ఓకే చెప్పారనీ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోపక్క, చిరంజీవి – మహేష్ మధ్య తాజాగా ఈ సినిమా గురించి చర్చ జరిగిందట. సినీ మహోత్సవం పేరుతో జరిగిన ఈవెంట్లో చిరంజీవి – మహేష్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ గురించి చిరంజీవి అడిగి తెలుసుకున్నారనీ, ‘సైరా నరసింహారెడ్డి’ విషయమై మహేష్, చిరంజీవిని అడిగి తెలుసుకున్నాడనీ అంటున్నారు.
Also Read: వైఎస్ జగన్తో చిరంజీవి భేటీ.. ఎప్పుడంటే.!
చిరంజీవి అంటే మహేష్కి మొదటి నుంచీ గౌరవం వుందన్నది ఓపెన్ సీక్రెట్. చిరంజీవి – ప్రభాస్ సంగతి సరే సరి. ఎన్టీఆర్ – చిరంజీవి గతంలో ఓ కార్యక్రమంలో కలివారు.. ‘మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే వుండాలి మీరు..’ అంటూ ఎన్టీఆర్, చిరంజీవిని కోరాడు కూడా. అయితే, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరు కన్పిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే, ఆ టైమ్కి ఎవరు అందుబాటులో వుంటారన్నది ఇప్పుడే చెప్పలేం.
