‘సైరా’ కోసం ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,247FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ఎవరూ ఊహించని అతిథులు హాజరు కాబోతున్నారట.

ఆ లిస్ట్‌లో ప్రభాస్‌, మహేష్‌తోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు కూడా విన్పిస్తోంది. నాగార్జున, వెంకటేష్‌ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని సమాచారమ్‌. మెగా కాంపౌండ్‌ నుంచి దాదాపు అందరూ ఈ ఈవెంట్‌కి హాజరు కాబోతున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ కమర్షియల్‌ సినిమాలా మాత్రమే కాకుండా, దీన్నొక ‘పాన్‌ ఇండియా’ ఫిలిం, పేట్రియాటిక్‌ ఫిలిం.. అనే కోణంలోనే అంతా భావించేలా ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారమ్‌.

ఇదిలా వుంటే, మహేష్‌తోపాటు ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో ఇప్పటికే నిర్మాత రామ్‌చరణ్‌ సంప్రదింపులు షురూ చేశాడనీ, ఆ ముగ్గురూ ఓకే చెప్పారనీ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోపక్క, చిరంజీవి – మహేష్‌ మధ్య తాజాగా ఈ సినిమా గురించి చర్చ జరిగిందట. సినీ మహోత్సవం పేరుతో జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి – మహేష్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్‌ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ గురించి చిరంజీవి అడిగి తెలుసుకున్నారనీ, ‘సైరా నరసింహారెడ్డి’ విషయమై మహేష్‌, చిరంజీవిని అడిగి తెలుసుకున్నాడనీ అంటున్నారు.

Also Read: వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. ఎప్పుడంటే.!

చిరంజీవి అంటే మహేష్‌కి మొదటి నుంచీ గౌరవం వుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. చిరంజీవి – ప్రభాస్‌ సంగతి సరే సరి. ఎన్టీఆర్‌ – చిరంజీవి గతంలో ఓ కార్యక్రమంలో కలివారు.. ‘మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తూనే వుండాలి మీరు..’ అంటూ ఎన్టీఆర్‌, చిరంజీవిని కోరాడు కూడా. అయితే, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎవరు కన్పిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే, ఆ టైమ్‌కి ఎవరు అందుబాటులో వుంటారన్నది ఇప్పుడే చెప్పలేం.

9 COMMENTS

సినిమా

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రాజకీయం

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

ఎక్కువ చదివినవి

శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో...

మేషం, వృషభం రాశుల వారికి ఉద్యోగ ప్రశంసలు – ఆర్థిక లాభ సూచనలు

మార్చి 4, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న ఆనంద వార్త వింటారు. ధన...

Chiranjeevi: ‘50 రోజుల మన శంకరవరప్రసాద్ గారు’.. వండర్స్ ఎన్నో..

Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో...

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...

ఉత్తరాంధ్రలో రూ.2,300 కోట్ల ఫార్మా దిగ్గజం

అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు...