పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన దీక్ష దసరాకి ముగిసింది. ఇక నుంచి తిరిగి ఆయన అటు రాజకీయ, ఇటు సినిమా పనులు పూర్తిగా ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన 26వ సినిమా ‘వకీల్ సాబ్’ షూటింగ్ ని 75% పూర్తి చేయగా, తన 27(క్రిష్ డైరెక్టర్), 28(హరీష్ శంకర్ డైరెక్టర్), 29(ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్) సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా దసరా రోజు తన 30వ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. సాగర్ చంద్ర డైరెక్షన్ లో చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు.
ఈ సినిమాకి ఒకప్పటి చిరు మూవీ టైటిల్ అయిన ‘బిల్లా రంగా’ని పరిశీలిస్తున్నారు. ఇక మేము తెలుసుకున్న ఎక్స్ క్లూజివ్ వార్త ఏమిటంటే.. అయ్యప్పనుమ్ కోశియుమ్ ఓ మల్టీ స్టారర్ ఫిల్మ్. మొదటి నుంచి ఇందులో రెండవ పాత్ర కోసం రానా ని అనుకుంటున్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాక రానా ప్లేస్ లో నితిన్ ని రీప్లేస్ చేసే విధంగా ప్రొడక్షన్ హౌస్ లో సన్నాహాలు జరుగుతున్నాయి.
నితిన్ సితార బ్యానర్ లో ఇప్పటికే భీష్మతో హిట్ అందుకోగా, త్వరలోనే ‘రంగ్ దే’తో రానున్నారు. అలాగే నితిన్ పవన్ కళ్యాణ్ కి ఓ వీరాభిమాని. ఇది అందరికీ తెలిసిందే. దాంతో అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ తీసుకొని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. మరో వైపు పవన్కళ్యాణ్ డిసెంబర్ లోపు వకీల్ సాబ్ కి సంబందించిన అన్ని పనులు పూర్తి చేసి 2021 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..
457606 287194This is a very good blog. Keep up all of the work. I too love to blog. This is wonderful everybody sharing opinions 325874