ప్రతిపక్ష నేత మీద జరిగిన హత్యాయత్నమది.! అది కూడా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే, విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం.! ఏళ్ళు గడుస్తున్నాయ్.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తున్నా, కేసు ఓ కొలిక్కి రావడంలేదు.
ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. త్వరలో ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయ్.! గత ఎన్నికలకు ముందర జరిగిన హత్యాయత్నం ఘటన అది. ఐదేళ్ళు గడుస్తున్నా, ఇంకా ఈ కేసులో ‘అసలు’ దోషులెవరు.? అన్నది మాత్రం తేలలేదు.
దాడికి పాల్పడిన వ్యక్తి అప్పటినుంచీ జైల్లోనే వున్నాడు. బెయిల్ కోసం న్యాయస్థానాన్ని పదే పదే అభ్యర్థిస్తున్నాడుగానీ, కోడి కత్తి సీనుకి బెయిల్ దొరకడంలేదు. ఎందుకిలా.? దోషి అని తేలితే, శిక్ష పడాలి.! కానీ, కేసు విచారణ సాగుతూ.. సాగుతూనే వుంది.!
బాధితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ కేసులో విచారణఖు ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. విదేశాలకు వెళ్ళేందుకు మాత్రం, కోర్టుల్ని ‘అనుమతి’ అడుగుతున్నారు.. అది మళ్ళీ వేరే కేసు వ్యవహారం. అక్రమాస్తుల కేసుకి సంబంధించి.. బెయిల్ మీదున్న వైఎస్ జగన్, బెయిల్ షరతులకు లోబడి వ్యవహరించాల్సిందే.
విదేశాలకు వెళ్ళాలంటే, కోర్టు అనుమతి తప్పనిసరి. అన్నట్టు, అక్రమాస్తుల కేసు విచారణకు సైతం, ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యక్ష విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వ్యవస్థల పట్ల ముఖ్యమంత్రికి ఎంత గౌరవమో.. అని జనం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.
అక్రమాస్తుల కేసు పక్కన పెడితే.. ఇది, ఏకంగా హత్యాయత్నం కేసు కదా.! పైగా, బాధితుడు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! కోడి కత్తి వెనుక, కీలక సూత్రధారి మంత్రి బొత్స సత్యానారఞన మేనల్లుడేనని, నిందితుడి తరఫు న్యాయవాది తాజాగా బాంబు పేల్చారాయె. అంటే, ఏంటి దానర్థం.? పబ్లిసిటీ కోసం ఈ హత్యాయత్నం జరిగిందనా.?