వంట గ్యాస్.. వంట గ్యాస్.. వంట గ్యాస్.! ప్రతి నెలా దాదాపుగా పెరుగుతూ వచ్చింది వంట గ్యాస్ ధర.. గత కొంతకాలంగా.! నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక, పెట్రో ధరలు.. వంట గ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగాయి.. పెరుగుతూనే వున్నాయి. పెట్రోధరల విషయంలో ఈ మధ్య నిలకడగా వుంటున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
రోజువారీ ధరల మార్పు ద్వారా వినియోగదారులకి తక్షణ లబ్ది చేకూరుతుందనీ.. ధరలు పెరిగితే, వెంటనే పెరుగుతాయనీ.. తగ్గితే వెంటనే తగ్గుతాయనీ.. అంతర్జాతీయ మార్కెట్ ఈక్వేషన్స్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చెబుతూ వచ్చింది. పెరగడం అయితే, పెరిగిపోయింది. తగ్గడం మాత్రం జరగడంలేదు.! ఇదేం విచిత్రమో.!
ఇక, వంటగ్యాస్ ధర విషయానికొస్తే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1150 రూపాయల ధర పలుకుతోంది గత కొన్నాళ్ళుగా. గతంలో, దాదాపు గం మేర సబ్సిడీ బ్యాంక్ అక్కౌంట్లలోకి జమ అయ్యేది. ఇప్పుడు అదీ లేదు. పది రూపాయలో, పాతిక రూపాయలో అప్పుడప్పుడూ జమ అవుతోందేమో.!
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దరిమిలా, వంట గ్యాస్ ధరను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 200 రూపాయల మేర తగ్గిస్తోంది కేంద్రం. ఉజ్వల పథకం కింద లబ్దిదారులైనవారికి ఇంకో రెండొందలు తగ్గుతుందట.
నాలుగు వందల రూపాయలకు కాస్త అటూ ఇటూగా వుండే వంటగ్యాస్ ధరని దాదాపు 1200 రూపాయల వరకు పెంచేసి, ఇప్పుడు రెండొందలు.. నాలుగొందలు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తే.. దాన్ని ఏమనాలి.? ఎంతో కొంత తగ్గిందని జనం సంబరాలు చేసుకోవాల్సిందేనేమో.!
పాలన.. అంటే, పన్నుల మోత.. అన్న బలమైన అభిప్రాయంతో పాలకులు వ్యవహరిస్తుండడం వల్లనే ఈ దుస్థితి. కేంద్రమైనా, రాష్ట్రాలైనా.. పోటీ పడి, ప్రజల్ని దోచుకుంటోంటే.. దీన్ని పాలన అని ఎలా అనగలం.? అని సామాన్యుడు వాపోతున్నాడు.!