కొత్త కేంద్ర పాలిత కేంద్రంగా ఏర్పడిన కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తొలుత కాశ్మీర్ ఎల్జీగా తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను నియమిస్తారనే ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ పోలీసు అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ కుమార్ ను కాశ్మీర్ కొత్త ఎల్జీగా నియమించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కు పెద్ద ట్రాక్ రికార్డే ఉంది. తమిళనాడు, కర్ణాటకలను వణికించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించిన టాస్క్ ఫోర్స్ కు చీఫ్ గా పనిచేసింది ఈయనే. వీరప్పన్ ఎన్ కౌంటర్ చేసేంత వరకు విజయ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన పేరు మార్మోగిపోయింది.
ఇక చెన్నై పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు నేరస్థుల పట్ల సింహ స్వప్నంగా వ్యవహరించారు. ఎంతోమంది కరడు గట్టిన నేరస్థులను ఎన్ కౌంటర్ చేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులై మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషించారు. 2018లో కాశ్మీర్ గవర్నర్ కు భద్రతా సలహాదారుగా నియమితులై ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు.
సమర్థుడైన పోలీసు అధికారిగా పనిచేసిన ట్రాక్ రికార్డు ఉండటం, కాశ్మీర్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం వంటి కారణాలతో విజయ్ వైపు కేంద్ర పెద్దలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఆయన నియామకం దాదాపు ఖారరైందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ను లడఖ్ ఎల్జేగా నియమిస్తారా లేక నరసింహన్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
567588 374865Wow truly glad i came across your internet internet site, i??ll be sure to visit back now i??ve bookmarked it??. 575999
581202 993881You created some good points there. I did a search on the topic and discovered a lot of people will agree with your blog. 631132