దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొన్ని రోజులుగా తగ్గుతోంది. ముందురోజు కంటే కొత్త కేసులు, మరణాలు తక్కువగా.. రికవరీలు ఎక్కువగా నమోదవుతూండటం ఊరటనిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో దేశవ్యాప్తంగా 6.24లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1233 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే కరోనాతో దేశంలో 31 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో ఇప్పటివరకూ 5.21లక్షల మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1876 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ కరోనా రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలకు దిగువగా ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4.30కోట్లుగా నమోదైంది.
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న 26.34లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. మొత్తంగా 183కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
568980 827919thaibaccarat dot com is the best website to study casino games : like baccarat, poker, blackjack and roulette casino 10505
312123 483042Soon after examine a couple of of the weblog posts inside your website now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark internet site list and might be checking back soon. Pls take a appear at my website as effectively and let me know what you believe. 632454