Nayanthara: సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార ఆ రూల్ ని బ్రేక్ చేశారు. హీరో జైతో కలిసి ఆమె నటించిన ‘అన్నపూరణి’ సినిమా సక్సెస్ నేపథ్యంలో సినిమా టీమ్ కాలేజ్ ను సందర్శించారు. చెన్నైలోని ఓ లేడీస్ కాలేజీకి వెళ్లి విద్యార్ధినులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. లంచ్ టైమ్ లో హాస్టల్ డైనింగ్ హాల్ కు వెళ్లి వారితో ముచ్చటించి బిర్యానీ వడ్డించి సంతోషంలో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నయనతారను చూడగానే విద్యార్ధినులు ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘అన్నపూరణి’ సినిమా నయనతారకు 75వ సినిమా. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇండియన్ బెస్ట్ చెఫ్ గా ఎదిగే కథతో సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం తమిళంలో ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ ఏడాది జవాన్ తో బాలీవుడ్ లో కూడా సక్సెస్ చూశారు నయనతార. ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు.
Briyani is even more special when Poorni serves it 🙂 #Annapoorani serving now in cinemas near you.
Enjoy the feast ❤️ pic.twitter.com/pf66rJCymI
— Zee Studios South (@zeestudiossouth) December 3, 2023