Nara Lokesh : తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణకు హాజరు అయిన నారా లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాడు.
ఈ కేసుకు సంబంధించి తనను 50 ప్రశ్నలు అడిగారు. ఆ 50 ప్రశ్నల్లో కేవలం ఒక్కటి మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించింది. ఇంతోటి దానికి ఒక రోజంతా సమయం వేస్ట్ చేశారు అంటూ లోకేష్ విమర్శించాడు. నేను మంత్రిని అయ్యాక ఏర్పాటు అయిన లేఔట్స్ గురించి ప్రశ్నించారు.. మరికొన్ని ప్రశ్నలు వేశారు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ విషయం లో ఎక్కువ చర్చ జరగేలేదు అన్నాడు.
50 ప్రశ్నలు అడిగిన అధికారులు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు రేపు విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే నేడే మొత్తం ప్రశ్నలు అడగమని అన్నాను. ఏ సమయం వరకు అయినా ఉంటాను అన్నాను. కానీ వారు మాత్రం రేపు విచారణకు హాజరు అవ్వాల్సిందే అన్నారు. విచారణకు సహకరించినందుకు అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే నా సమాధానం పట్ల వారు సంతృప్తి చెందినట్లే కదా అన్నట్లుగా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీ పై చమక్కులు పేల్చాడు.