జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వస్తున్న నాయకులు, కార్యకర్తలకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటం గ్రామంలో నాగబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఇరిగేషన్ శాఖకు చెందిన వారధిపై జనసేన జెండాలను కడుతున్న కార్యకర్తలను పోలీసులు ఇబ్బందిపెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదు. ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటం తగదు. నాయకులు, కార్యకర్తలు సభ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు 12 కమిటీలు వేశాం. పోలీసులు కూడా సహకరించాలి’.
‘రాజకీయ కారణాలతో ఇప్పటికే మూడు ప్రాంతాలు మార్చాం. సభ పండగ వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాం. సభా వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాం. ఆయన విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మన సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నాయకులంతా రేపు ఉదయానికే సభాస్థలికి రావాలి. కార్యకర్తలు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు.
634980 18870Wow! This can be one certain of the most beneficial blogs We have ever arrive across on this topic. Actually Wonderful. Im also an expert in this subject so I can understand your hard function. 660695
31328 855705Is gonna be back incessantly to check up on new posts 744169
200417 55278Hi there! Good stuff, please do tell me when you lastly post something like this! 430854
58017 295192Appreciate it for helping out, superb details. 606439