కరోనా నివారణకు.. రాకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంకు చెందిన ఆనందయ్య ఔషదంను కనిపెట్టిన విషయం తెల్సిందే. ఆయన కనిపెట్టిన ఔషదంను పరీక్షించాలంటూ ప్రభుత్వం పంపిణీ వాయిదా వేసింది. దాంతో ఆనందయ్య ప్రస్తుతం ఆ ఔషదంను తయారు చేయకూడదు అంటూ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం అనుమతులు రాలేదు కృష్ణ పట్నం ఎవరు రాకూడదు అంటూ ఇప్పటికే ఆనందయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా కొందరు తరలి వెళ్తున్నారు. ఈ సమయంలోనే మంత్రులు మరియు ఎంపీ వద్ద ఆనందయ్య తయారు చేసిన మందు కనిపించింది.
ఆనందయ్య తయారు చేసిన మందును ఒంగోలు జిల్లా అధికారుల సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగుంటి వద్ద అలాగే మంత్రులు విశ్వరూప్ మరియు బాలినేనిల వద్ద కూడా కనిపించాయి. స్వయంగా ఆనందయ్య ఆ మందును వారికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక వైపు ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు అంటూనే ఆనందయ్య ఎలా వీఐపీలకు మందు సరఫరా చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందయ్య మందు కూడా ఇలా బ్లాక్ దందా సాగడం విచారకరం అంటున్నారు.
903189 796165I was just searching for this info for some time. After 6 hours of continuous Googleing, finally I got it in your website. 878003
653181 875504Id need to speak with you here. Which is not some thing I do! I spend time reading an article that could get individuals to feel. Also, appreciate your allowing me to comment! 251202