Maths: పరిక్షల్లో తక్కువ మార్కులొస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. లెక్కల్లో (Maths) మార్కులు తక్కువొస్తే తిట్టిపోస్తారు కూడా. కానీ.. ఇందుకు విరుద్ధంగా ఓ విద్యార్ధినికి లెక్కల్లో సున్నా మార్కులు వచ్చినా ఆమె తల్లి చూపిన సానుకూల దృక్పథం.. ఇందుకు సంబంధించి ఓ యువతి చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
జైనాబ్ అనే యువతి తాన ఆరో తరగతి మార్కుల షీట్ ను పోస్ట్ చేసింది. అందులో ఆమెకు లెక్కల్లో 0/15 వచ్చాయి. దీనిపై..’ఆ రోజు అమ్మ నన్ను కొట్టలేదు. పైగా.. సున్నా మార్కులు తెచ్చుకోవాలంటే ధైర్యం కావాలి. నీలో ధైర్యం చాలా ఉంద’ని ప్రోగ్రెస్ కార్డుపై రాసింది. ఆ మాటలు నా ఆలోచనను మార్చేశాయి. తర్వాత లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించాయి’.
‘మా అమ్మ నన్ను తిట్టలేదు. మీరూ మీ పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకున్నారని కోప్పడవద్దు. సానుకూలంగా ఉండండి.. మంచి ఫలితాలు అవే వస్తాయ’ని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె తల్లి అందించిన ప్రోత్సాహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon
— zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023