ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీతో కలిసి ఆదివారం ఒకే వేదికపై ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పరిణామాలు బాగా వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి కమలనాథులకు మధ్య మంచి పోటీ కనపడుతోంది. ఇప్పటికే పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ సైతం బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీలో చేరతారా లేక బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనే విషయంలో ఆదివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గతనెల 16న ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తో కూడా మిథున్ భేటీ కావడం, తాజాగా మోదీతో కలిసి కనిపించనుండటంతో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మిథున్ గతంలో తృణమూల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే, తర్వాత శారదా చిట్ ఫండ్ కేసులో చిక్కుకోవడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి తృణమూల్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
355931 207517I wanted to say Appreciate providing these details, youre performing a fantastic job with the web site… 502077
961771 856400Good day very cool blog!!Guy .. Excellent .. Superb. 981709