సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా నిన్నటితో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్టు యూనిట్ తెలిపింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా మహేష్ డబ్బింగ్ పనులు కూడా పూర్తీ చేయడంతో సినిమా విడుదలకు అన్ని మార్గాలు సుగమం అయ్యాయి. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.
మే 9 న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే 140 కోట్ల భారీ బిజినెస్ చేసింది. నిజంగా బాహుబలి తరువాత ఆ రేంజ్ లో బిజినెస్ చేసిన సినిమా మహర్షి. దాంతో సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ , పివివి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు.
ఇప్పటికే ట్రైలర్ తో పాటు మూడు సాంగ్స్ కూడా విడుదలై యూ ట్యూబ్ లో దుమారం రేపుతున్నాయి. ఇక ట్రైలర్ అయితే ఏకంగా 20 మిళియన్స్ వ్యూస్ రాబట్టి మహేష్ క్రేజ్ ఏమిటో మరోసారి చాటింది. ఇక మహర్షి సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తీ చేసుకున్న మహేష్ ఈ హాలిడేస్ కోసం ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. మహేష్ తన ప్రతి సినిమా షూటింగ్ పూర్తీ చేసాక , ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో టూర్ వేయడం అలవాటే .. ఇప్పుడు మహర్షి సమ్మర్ టూర్ ఏ దేశానికో మరి.
880278 339868Youd superb suggestions there. I did a research about the issue and identified that likely almost anyone will agree with your web page. 27880
443671 465064I surely didnt understand that. Learnt a thing new today! Thanks for that. 671460
765931 492132Some truly nice stuff on this site , I like it. 852615