Mahesh Babu : సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా కు మొదట నెగిటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి, ఇంకా వస్తున్నాయి అంటూ నిర్మాత మాటలను బట్టి అర్థం అవుతోంది. ఏపీ లో ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా కలెక్షన్స్ ఉన్నట్లుగా నిర్మాత నాగ వంశీ ప్రకటించాడు.
తాజాగా నాగ వంశీ మీడియా ముందుకు వచ్చి గుంటూరు కారం కలెక్షన్స్ మరియు ఇతర విషయాల గురించి స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ విడుదల ముందు వరకు చేస్తూనే ఉండటంతో ప్రమోషన్ ను ఎక్కువ చేసే అవకాశం లభించలేదు.
గుంటూరు కారం సినిమా జోనర్ ఇది అని మేము ప్రచారం చేయడానికి సమయం లేకపోవడం వల్ల తప్పు జరిగిందని ఆయన పేర్కొన్నాడు. సినిమా ప్రమోషన్ చేసే సమయంలో ఎలా ఉంటుంది, ప్రేక్షకులు ఏం ఆశిస్తే ఈ సినిమా తో సంతృప్తి పడుతారు అనే విషయాలను ప్రమోషన్ ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గుంటూరు కారం సినిమాకు అది సమయం లేకపోవడంతో సాధ్యం కాలేదని నిర్మాత నాగ వంశీ కూడా క్లారిటీ ఇచ్చాడు.