Switch to English

మహేష్‌కి సెంచరీ ఇప్పటికీ ‘కల’గానే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకి ఇప్పటిదాకా కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క 100 కోట్ల వసూళ్ళ సినిమా కూడా లేదా.? అంటే, ఔననే అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మహేష్‌ లెక్కల్లో అయితే, శ్రీమంతుడు సినిమానే 100 కోట్లు దాటేసింది. ‘భరత్‌ అనే నేను’ కూడా అంతే. ఇక, లేటెస్ట్‌గా విడుదలైన ‘మహర్షి’ తొలి వారంలోనే తన గత చిత్రాల రికార్డుల్ని తిరగరాసేసిందని మహేష్‌ చెప్పుకున్నాడు. ఆ లెక్కన మహేష్‌కి మొత్తం మూడు సినిమాలున్నాయన్నమాట.. 100 కోట్లు సాధించినవి. ఈ వంద కోట్లు అన్నది షేర్‌ లెక్క. కానీ, వాస్తవం ఇంకోలా వుంది.

‘శ్రీమంతుడు’ సినిమా 90 కోట్లు కూడా టచ్‌ చేయలేదు. ‘భరత్‌ అనే నేను’ 90 కోట్ల మార్క్‌ టచ్‌ చేసింది. ‘మహర్షి’ సినిమా 100 కోట్లకి కాస్త దూరంలో ఆగిపోయింది. కానీ, ‘మహర్షి’ టీమ్‌ మాత్రం ఎప్పుడో తమ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని చెబుతోంది. తమ తమ సినిమాలకి షేర్ల పరంగా, గ్రాస్‌ పరంగా చూస్తే వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేయడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. కానీ, అంతిమంగా వసూళ్ళ వివరాలు కాస్త ఆలస్యంగానైనా బట్టబయలయిపోయాక, అంతా కామప్‌ అయిపోతుంటారు.మహేష్‌ విషయంలో ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. మహేష్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలైన ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలకి కూడా ఎవరూ నమ్మలేనంత పెద్ద పెద్ద మొత్తాలు చెప్పేసి, ఆ తర్వాత నాలిక కర్చుకున్నారు.

‘ఇకపై నా సినిమాలకు సంబంధించి వసూళ్ళ లెక్కల్ని ప్రకటించకూడదని నిర్మాతలను కోరుతున్నాను..’ అంటూ ‘రంగస్థలం’ సినిమా తర్వాత సంచలన నిర్ణయం ప్రకటించాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. అయితే, ‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాపయినా, 70 కోట్ల పైన షేర్‌ వచ్చినట్లు అప్పట్లో మెగా పవర్‌ స్టార్‌ అభిమానులు నానా హంగామా చేశారనుకోండి.. అది వేరే విషయం.

ఓ సినిమా హిట్టయితే, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. సరిగ్గా ఆడని సినిమాకి ఎంత ప్రమోషన్‌ చేసినా ఉపయోగముండదు. ‘మహర్షి’ సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది విడుదల రోజునే. కానీ, అనూహ్యంగా పుంజుకుంది. అలా చూస్తే, మహేష్‌ ‘మహర్షి’ సినిమాతో హిట్టుకొట్టినట్లే. కానీ, గ్రాస్‌ లెక్కలు.. షేర్ల వివరాల గురించి మాట్లాడుతూ ఆ సినిమా విజయాన్ని తక్కువ చేస్తున్నారనే ఆవేదన నిజమైన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...