2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెలుగు హీరోయిన్ మాధవి లత చిత్తుగా ఓడిపోయారు. ఆమెకు పెద్దగా డిపాజిట్ కూడా దక్కపోవడంతో చాల టెన్షన్ పడింది. మాధవి లతకు కేవలం 1989 ఓట్లు మాత్రమే రావడం విశేషం. తెలుగులో నాని హీరోగా వచ్చిన స్నేహితుడా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సినా మాధవి లత ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. గత కొన్ని రోజులుగా చేతిలో సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈమెకు బిజెపి తరపున గుంటూరు వెస్ట్ నుండి ఎం ఎల్ ఏ టికెట్ ఇచ్చారు.
ఎన్నికల ముందు బాగానే ప్రచారం చేసిన మాధవి లత ఓడిపోవడంతో తన బాధను వెళ్లగక్కింది. తాను ఓడిపోతానని ముందే తెలుసు అని, ఆ విషయం పార్టీకి కూడా తెలుసనీ .. కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం మాత్రం తనను బాగా బాధించిందని తెలిపింది. ఇక్కడ కేవలం కులం, డబ్బు మాత్రమే పనిచేశాయని అన్నారు. తన కామెంట్ ను సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి తన ఓటమి విషయంలో బాగా ఫీలయిన మాధవి లత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు ఇస్స్యూస్ గురించి కెమెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.
మోడీ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని, ఈ సారి ఈవిఎంల టాంపరింగ్ ఉంటె బిజెపి ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా గెలిచేదిగా అంటూ ఘాటు కామెంట్ చేసింది. అంతే కాదు .. చదువుకున్న వారు, నిజాయితితో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదని, మాజీ జెడి లక్ష్మి నారాయణ ను ఎందుకు ఓడించారని ప్రశ్న వేసింది. మొత్తానికి మాధవి లత ఘాటు కామెంట్స్ తో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
232017 975342There is noticeably a bundle to know about this. I assume you produced certain good points in capabilities also 170107
950139 59435Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 586802
53932 194303It is essential to have having access to the knowledge posted here 252644