సినిమాలకు, రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు సినీ రంగంలోకి వస్తే .. ఎక్కువగా సినిమా రంగంలో ఉన్నవారు రాజకీయాల్లోకి వెళుతున్నారు. ఇది ఇప్పటిది కాదు నాటి నుండి జరుగుతున్న తంతు. తాజగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. మరి ఈ ఎన్నికల్లో పలువురు సినిమా తారలు ఎక్కువమంది పోటీ చేసారు .. మరి వారిలో గెలుపు గుర్రాలు ఎవరో .. ఓటమి పాలైంది ఎవరో చూద్దామా..
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించింది వైఎస్ఆర్సిపి. జగన్ నాయకత్వంలో రంగంలోకి దిగిన ఈ పార్టీ ఎవరు ఊహించని విధంగా 149 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంది. 25 లోక్ సభ స్థానాలతో దేశంలోనే నాలుగో మెజార్టీ పార్టీగా అవతరించింది. ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి .. టిడిపి సైకిల్ పంచర్ అయింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో టిడిపి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా మారింది పరిస్థితి.
ఈ ఎన్నికల బరిలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రెండో సారి హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. అయన మొదటి సారి అత్యధిక మెజారిటీతో హిందూపూర్ నుండి ఎన్నిక కావడం ఈ సారి ఆ మెజారిటీ కాస్త తగ్గింది. ఇక ఐరెన్ లెగ్ గా ఇమేజ్ తెచ్చుకున్న రోజా, తాను ఐరెన్ లెగ్ కాదని .. లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేసుకుంది. నగరి బరిలో ఎంఎల్ఏ గా రెండో సారి విజయ కేతనం ఎగురవేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ ఈ సారి చాలా గట్టి పోటీ మధ్య విజయం సాధించి మళ్ళీ ఎంపీగా తన సత్తా చాటుకున్నారు. వైజాగ్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ నిర్మాత ఎం వివి సత్యనారాయణ పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ ఫైనాన్సియర్ రఘురామా కృష్ణం రాజు నర్సాపురం ఎంపిక జెండా పాతాడు.
ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని- వల్లభనేని వంశీ ఇద్దరు చెరో పార్టీలో పోటీ చేసి ఇద్దరు మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరులు కన్నబాబు కూడా ఈ సారి ఎంఎల్ ఏ గా ఎన్నికయ్యారు. పూరి జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఇదివరకే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈ సారి గెలుపు గుర్రమెక్కాడు. అయన వై కాపా తరపున నిలబడ్డాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు మొదటి సారి ఎంపిక జనసేన తరపున పోటీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో వైఫల్యం చెందాడు.
జనసేన పార్టీ స్థాపించి .. ప్రజలకోసమే అంటూ తన సినీ జీవితాన్ని త్యాగం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి మరి దారుణంగా మారింది. అయన జనసేన పార్టీ తరపున ఈ ఎన్నికల్లో కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగా .. జనసేన అధినేత పవన్ మాత్రం రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేసి ఓడిపోవడం జనసేన వర్గాల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకుంటే కర్ణాటకలో మాజీ నటి సుమలత ఈ సారి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రముఖ సినీ నటుడు అంబరీష్ మృతి చెందడంతో అయన స్థానంలో సుమలత పోటీ చేసింది. అలాగే కర్ణాటకలో సోలోగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓటమిపాలయ్యారు.
యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మి, మహారథి లాంటి సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఈ సరి ఎన్నికలో ఎం ఎల్ ఏ అభ్యర్థిగా గెలిచారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా నటించిన భోజపురి నటుడు రవికిషన్ ఈ సారి బిజెపి తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇంతకు ముందు అయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక కర్ణాటకలో సుమలతకు పోటీగా ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా జాగ్వార్ సినిమాతో పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ హీరో సుమలతకు పోటీగా నిలబడి ఓటమిపాలయ్యారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ కూడా విజయం సాధించారు. ఈ లిస్ట్ లో ఇంకా చాలామంది ఉన్నారు.
814741 822563Most what i read online is trash and copy paste but i think you offer something different. Keep it like this. 949999