Switch to English

లగడపాటి సర్వే ముందే వచ్చింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అనూహ్యంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఎగ్జిట్‌ ఫలితాలను వెల్లడించేందుకు మరో రోజు సమయం ఉన్నప్పటికీ, చూచాయగా తన సర్వే వివరాలను బయటపెట్టారు. రాజధాని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానని, తన సర్వే ఫలితాలను ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో వెల్లడిస్తానని చెబుతూనే తెలంగాణలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి? ఏపీలో అధికారం ఎవరిది అనే అంశాల్లో స్పష్టత ఇవ్వడం గమనార్హం. ఏపీలో హంగ్‌ వచ్చే అవకాశం లేదని లగడపాటి స్పష్టంచేశారు. ప్రజలు ఒక పార్టీకే కచ్చితమైన మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఏపీలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోరు జరిగిందని, 95 శాతం మంది ఓటర్లు మూడు పార్టీలకు ఓటేశారని వివరించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉన్న కారణంగా అక్కడి ప్రజలు కారు ప్రయాణాన్నే కోరుకున్నారని.. లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు సైకిల్‌తో సరిపెట్టుకున్నారంటూ అసలు విషయం చెప్పకనే చెప్పేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధిక సీట్లు గెలుచుకుంటుందని, ఏపీలో అధికారం టీడీపీదేనంటూ పరోక్షంగా వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పూర్తి వివరాలు ఇప్పుడు వెల్లడించలేనంటూ చూచాయగా విజయం ఎవరిదో లగడపాటి తెలివిగా వివరించారు.

ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. అయితే, ఆయన పార్టీకి ప్రజారాజ్యం కంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని, ప్రజల నాడి తెలుసుకోవడం తన హాబీ అని, అందుకే సర్వే చేయిస్తుంటానని తెలిపారు. గతంలో తెలంగాణలో తాను చెప్పినదానికి వ్యతిరేక ఫలితం వచ్చిందని ప్రస్తావిస్తూ.. అన్నిసార్లు సరైన ఫలితం రావాలని ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రజానాడి తెలుసుకుని ఆదివారం తిరుపతిలో మొత్తం వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

తాను చెప్పబోయే ఫలితాలు రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. అయితే, లగడపాటి సర్వే ఫలితాలను వెల్లడించడంపై వైఎస్సార్‌ సీపీ మండిపడింది. చంద్రగిరిలో ఆదివారం రీపోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి లగడపాటి ‍ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇలాగే వ్యవహరించారని గుర్తు చేసింది. తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్నతో భేటీ తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా సర్వే ఫలితాలు వెల్లడించారని దుయ్యబట్టింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...