కర్ణాటక రాష్ట్ర మంత్రి రాసలీలల సీడీలు బయటకు రావడంతో ఆయన నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. తన రాజీనామా వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు అనే ఆరోపణలు ఆయన చేస్తున్నాడు. ఈ సీడీలు ఎక్కడ నుండి వస్తున్నాయి ఎవరు పంపిస్తున్నారు అనే విషయం తెలియాలంటే ప్రత్యేక అధికారి విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు.
ఈ సమయంలోనే మరి కొందరు మంత్రులు తమ పేరుతో కూడా ఇలాంటి సీడీలు వచ్చే అవకాశం ఉందనే అనుమానంతో కోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ఆ సీడీలు కనుక వస్తే వాటిని ప్రసారం చేయవద్దని కోర్టుకు వెళ్లి విజ్ఞప్తి చేశారు.
2018లో కుమారస్వామి ప్రభుత్వంకు వ్యతిరేకంగా కొందరు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో వారు ముంబయిలో ఒక హోటల్ లో ఉన్నారు. 15 మంది ఎమ్మెల్యేలకు కేటాయించిన హోటల్ లో స్టింగ్ ఆపరేషన్ లేదా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఉంటారని అంటున్నారు. అందుకే ఆ 15 మందిలో ఆరుగురు కోర్టును ఆశ్రయించి తమ సీడీలు వస్తే ప్రసారం చేయవద్దని మీడియాపై కోర్టుకు వెళ్లి నోటీసులు తీసుకు రావడం జరిగింది.
అంటే క్యాంపు ఏర్పాటు చేసినప్పుడు ముంబయి హోటల్ లో ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఆ పరిణామాలు ఇప్పుడు మంత్రులతో పాటు ముఖ్య మంత్రికి కూడా ఇబ్బందిగా మారింది. బీజేపీ నాయకత్వం ఈ విషయమై చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు. సీఎం యడ్యూరప్పపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి.
19995 333628 Its hard to discover knowledgeable folks on this topic, but you sound like you know what you are talking about! Thanks 58400