Switch to English

‘కులం’ పోటు: బాబుని వదిలి ‘కమ్మ’గా బీజేపీలోకి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వున్నప్పుడు పెద్దగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ‘కులం’ పేరుతో ఆరోపణలు రాలేదుగానీ, ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిందో, ఆ తర్వాతి నుంచీ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణలో సొంత సామాజికవర్గమే చంద్రబాబుని నిండా ముంచేసిందంటారు చాలామంది. అలా సొంత సామాజిక వర్గం పొడిచిన ‘కులం పోటు’కి తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో అడ్రస్‌ గల్లంతయిపోయిందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు అదే పోటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబుకి తప్పేలా కన్పించడంలేదు. ఆ తొలి పోటు, విజయవాడ ఎంపీ కేశినేని నాని నుంచే కాబోతోందట.

ఎంత బుజ్జగించినా కేశినేని నాని, తెలుగుదేశం పార్టీలో కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా కేశినేని నాని నుంచి టీడీపీ మీద సెటైర్లు పడ్తున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎంపీలుగా గెలిచారన్న ఆనందం చంద్రబాబుకి ఎక్కువ కాలం మిగిలేలా లేదు. ఆ ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ బీజేపీతో టచ్‌లోకి వెళ్ళారు, మరొకరు బీజేపీతోపాటు వైఎస్సార్సీపీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఐదేళ్ళపాటు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీల్నీ, పలువురు ఎమ్మెల్సీలనీ, అలాగే రాజ్యసభ సభ్యుల్నీ కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అంత తేలిక కాదు. అయితే, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబుకి మొదట సొంత సామాజిక వర్గం నుంచే గట్టి ‘పోటు’ ఎదురవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది నిజంగానే చంద్రబాబుకి ‘వెన్నుపోటు’. ఎన్నికలకు ముందే, సొంత సామాజిక వర్గం నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు చంద్రబాబు. అది ఎన్నికల్లో తీవ్ర ప్రభావమే చూపింది.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ సామాజిక వర్గం ఈ సారి దాదాపు కుదేలైపోయింది రాజకీయంగా. ఈ నేపథ్యంలో మళ్ళీ బలపడాలంటే అధికార పార్టీల వెంట పరుగు తీయక తప్పదన్న కుల పెద్దల సూచనతో, వడి వడిగా అడుగులు వేసేస్తున్నారు అటు వైపుగా టీడీపీకి చెందిన సదరు సామాజిక వర్గ ప్రముఖులు. సరిగ్గా, ఈ పాయింట్‌ని ముందే ఊహించిన భారతీయ జనతా పార్టీ, ఎన్నడూ లేని విధంగా ఆ సామాజిక వర్గాన్ని పూర్తిస్థాయిలో టార్గెట్‌ చేసినట్లు కన్పిస్తోంది.

పదవుల ఎర చూపి కొందర్ని, కేసులతో బెదిరించి మరికొందర్ని లొంగదీసుకునే ప్రయత్నాల్ని ఆల్రెడీ స్టార్ట్‌ చేసేసిందట. ఎంపీ కేశినేని నాని మాత్రమే కాదు, అరడజను మంది వరకు టీడీపీ ప్రముఖులు అతి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారమ్‌. అయితే, జరగబోయే డ్యామేజ్‌ని ముందే ఊహించిన చంద్రబాబు, కుల పెద్దల్ని రంగంలోకి దించి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు పప్పులుడికేలా లేవిక్కడ.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...