Kamal Haasan: నాయకన్ తర్వాత 35ఏళ్లకు కమల్ హాసన్ (Kamal Haasan) -మణిరత్నం (Maniratnam) కాంబినేషన్లో తెరకెక్కేబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న వార్తలు అంచనాలు పెంచుతోంది. సినిమాలో హీరోయిన్ గా నయనతార (Nayanthara) ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్ కోసం మరో పాత్ర ఉందని నెట్టింట వార్తలు రౌండ్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష (Trisha) ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు కూడా తెలుస్తోంది.
#KH234గా తెరకెక్కబోయే సినిమాలో ఓ అతిధి పాత్ర ఉందని.. దీనికి రజినీకాంత్ (Rajinikanth) ను ఒప్పించే పనిలో టీమ్ ఉందని.. ఇప్పటికే సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి టీజర్ ను రెడీ చేశారని అందుకు కొన్ని సన్నివేశాలు కూడా ఇప్పటికే చిత్రీకరించారని అంటున్నారు. దీనిని నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ విజయం తర్వాత కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్2లో నటిస్తున్నారు.