ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరితో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్ తీరుపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై చర్యలు తీసుకునే క్రమంలో భారత్ కాస్త ఉదసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉన్నా.. భారత్ ఈ విషయంలో ముందుకు రాలేకపోతోందని అన్నారు. సీఈఓలతో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నాటోను విభజించగలను అనుకుంటున్న పుతిన్ అది సాధ్యమయ్యే పని కాదని అర్ధమైంది. నాటో గతంలో కంటే ఇప్పుడే మరింత బలంగా ఉంది. పుతిన్ అడ్డుకోవడంతో నాటో, అమెరికా మిత్ర దేశాలు, ఐరోపా సమాఖ్య దేశాలు ఐకమత్యంగానే ఉన్నాయి. క్వాడ్ కూటమిలో దేశాలు కూడా రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ.. భారత్ మాత్రం వెనకడుగు వేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన సైనిక చర్యకు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
703084 539503Hi. Thank you for making this web site . I m working on betting online niche and have located this web site making use of search on bing . Is going to be certain to appear more of your content material . Gracias , see ya. :S 881608