‘నదుల్ని, చెరువుల్ని అధికారంలో వున్నప్పుడు అమ్మేస్తే.. భవిష్యత్ భయానకంగా మారుతుంది’ అంటూ ఇటీవలి భారీ వర్షాల నేపథ్యంలో హైద్రాబాద్ ముంపుకు గురికావడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
‘ఇప్పుడు అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఆనాటి తప్పిదాల్ని సరిదిద్దాల్సిన బాధ్యత వుంది. నెపం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టేయలేం. గత పాలకుల వైఫల్యాలు హైద్రాబాద్కి శాపంగా మారాయి. ఎప్పుడో చెరువుల్ని కబ్జా చేశారు.. అమ్మేశారు.. టౌన్షిప్లు వెలిశాయి.. కోట్లు పెట్టి విల్లాలు కొన్నవారు కూడా ముంపుకు గురయ్యారంటే, సామాన్యుల పరిస్థితి ఇంకెలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి ముందు ముందు ఊహించలేనంత దారుణంగా వుంటుంది..’ అని పవన్ అభిప్రాయపడ్డారు.
తక్షణం తెలంగాణ ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించాలని జనసేనాని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రకృతిని పరిరక్షించడం మన బాధ్యత. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రజలు, ప్రభుత్వాలకు సహకరించాలి..’ అని కోరారు పవన్. ‘తప్పుని తప్పుగా అధికారులు ప్రభుత్వం దృఫ్టికి తీసుకెళ్ళాలి. అధికారంలో వున్నవారి మెప్పు కోసం అధికారులు ప్రయత్నిస్తే, భవిష్యత్ తరాలు దెబ్బతింటాయ్’ అన్నారు జనసేనాని.
ప్రభుత్వాలు మారతాయి.. కానీ, వ్యవస్థలు అలాగే వుంటాయి.. అని చెప్పిన జనసేనాని, నగరీకరణ అనూహ్యంగా పెరిగిపోయిన దరిమిలా ఇలాంటి సమస్యలు ముందు ముందు ఇంకా పెరుగుతాయి గనుక, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇటీవలి వరదల నేపథ్యంలో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం విదితమే. ఒక్క హైద్రాబాద్ మాత్రమే కాదు, నగరాలన్నిటిలోనూ చెరవులు, నాలాల కబ్జాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జనసేన అధినేత సూచించారు.
356216 921540I adore the appear of your internet site. I lately built mine and I was searching for some design suggestions and you gave me a few. Could I ask you whether you developed the site by youself? 691656
164355 853504hi!,I like your writing very a lot! 594211
235522 556972Real instructive and fantastic anatomical structure of articles , now thats user pleasant (:. 796492